ఎన్ఐఏ కు ఉగ్రవాదం
కేసులు, రెండు, మూడు రాష్ట్రాల్లో నేరాలతో సంబంధమున్న కేసులను మాత్రమే అప్పగిస్తారు.
ఎన్ఐఏ ఏర్పాటు చట్టంలోనే ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. అలాంటప్పుడు వైసీపీ
అధ్యక్షుడు వైఎస్ జగన్మొహనరెడ్డి పై జరిగిన కోడి కత్తి దాడి లాంటి చిన్న కేసుపై ఎన్ఐఏ
విచారణ చేయడం, ఆ సంస్థ చట్ట పరిధి ని అతిక్రమించడమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
పేర్కొంటోంది.
రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం ప్రకారం ఆలోచిస్తే అది నిజమేకావచ్చు. కాని ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే - ఎన్ఐఏ యాక్ట్ ప్రకారం కేసును ఎన్ఐఏకి బదిలీ చేయాలని వైఎస్ జగన్మొహన రెడ్డి తరపు న్యాయవాది గత విచారణ సమయంలో కోర్టును కోరారు. కేసు దర్యాప్తు ఆలస్యమైతే సాక్ష్యాధారాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుదృష్టికి తీసుకువచ్చారు.
ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించడంపై కేంద్ర, రాష్ట్రాలను హైకోర్టు గతంలోనే అడిగి తెలుసుకుంది. ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించడంపై కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే, తామే తీసు కుంటామని హైకోర్టు తేల్చి చెప్పడంతో కేంద్రం దిగొచ్చి ఎన్ఐఏ విచారణకు అంగీక రించింది. అంతేకాదు దానికి ముందే యాదృచ్చికంగా — పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు కేసును ఎన్ఐఏకి బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
పై విషయాలతో రాజకీయాలను ప్రక్కన పెట్టి పరిశీలిస్తే – రాష్ట్ర ప్రభుత్వం చాలా విషయాలను మరుగుపరుస్తుందని పిస్తుంది.
1 ప్రతిపక్షనేత
జగన్మోహనరెడ్డిపై విశాఖ ఏయిర్-పోర్ట్ లో హత్యాప్రయత్నం జరిగిన కొద్దిసేపటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పొలీస్ స్పందన, చేసిన ప్రకటన అనుమానా స్పదంగా ఉంది.
2 ఆ తరవాత కొంత సేపటికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రకటన ఆ అనుమానాన్ని పదింతలు చేసింది.
3 ఆపై టిడిపి నేతలంతా కూడబలుక్కొని చేసిన ప్రకటనలు అసలు ఒక ప్రతిపక్ష నాయకునిపై హత్యాప్రయత్నం జరిగినప్పుడు ఒక ప్రజా ప్రభుత్వం స్పందించవలసిన తీరు ఇదేనా? ఆని నోటిపై వెళ్ళేసుకోని వారు లేదు.
4 కేసు చిన్నది – అనటం ప్రభుత్వానికి ఆతహత్యాసదృశం.
5. మారణాయుధం (కోడికత్తి) గుఱి తప్పింది కాని ఒకవేళ ఆ దాడిలో ప్రతిపక్ష నాయకునికి మరణం సంభవిస్తే – శాంతి భద్రతల సమస్య తలెత్తి ఉంటే, పరిస్థితులు దారితప్పి దిశదశా ఎటు మార్చుకునేవో? అనెది పెద్ద ప్రశ్న. ఊహకందనిది.
6 భాదితునికి రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేకపోవటానికి పై కారణాలు చాలవా? ఈ తతంగం చూశాక ప్రజలకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థపై నమ్మకం పోలేదా?
7 కనీసం రాష్ట్ర పోలీసులు లేదా సిట్ విచారణ సమయంలోసైతం నిందితుడు పని చెసే హోటల్ యజమానిని ప్రశ్నించటం ధర్మం. అసలు ఎయిర్-పోర్ట్ లాంటి అత్యంత కట్టుదిట్టమైన ప్రదేశంలోనే ఇలా జరిగితే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అనుమానాస్పదం కాదా?
8 అసలు నిందితునికి ఉద్యోగం ఎలా యిచ్చారు? ఏయిర్-పోర్ట్ ప్రవేశ అనుమతి ఎలా లభించింది? దీని నేపధ్యం పై విచారణ జరగక పోగా – హోటల్ యజమాని వెనక పెద్దల హస్తం ఉందన్న వాదన ప్రజల్లో ఉదృతంగా ఉంది.
9 అన్నింటిని మించి ఎవరి ప్రాణం వారికి తీపి. సామాన్యుడైతే తన ఖర్మకు తాను చచ్చేవాడు. ప్రతిపక్షనేత — కాబినెట్ మంత్రి స్థాయి రాంక్ ఉన్న ఆయనపై జరిగిన దాడిని చిన్ననేరం అని కొట్టిపారేస్తేనే అక్కడ ఎవరిదో పెద్దల హస్తం ఉన్నట్లు గోచరిస్తుంది — అనుమానం ఖచ్చితంగా వస్తుంది. వీటికి తోడు తొలిదశ లోనే డిజిపి ప్రవర్తన సమాధానం ఇవన్నీ ప్రభుత్వాన్ని శంఖించటానికి ప్రధాన కారణాలు. డిజిపిది పొలిటికల్ పోష్ట్ కాదు గదా! ఎలాబడితే అలా మాట్లాడటానికి.
10 హైకోర్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మొట్టికాయలెయ్యగా -స్పర్శఙ్జానం లేని రాష్ట్రప్రభుత్వం స్పందించకపోగా–కేంద్ర స్పందించి కేసును అదీ హైకోర్ట్ నిర్దేశకత్వంలో జాతీయ విచారణ సంస్థ (ఎన్ఐఏ) కు బదిలీ చేస్తే దానికి రాష్ట్రం సహకరించ వలసింది పోయి కేంద్ర రాష్ట్ర సంభందాలను మద్యలోకి తీసుకు రావటం అసలే రాష్ట్ర ప్రభుత్వం పై పోలీసులపై ఉన్న అనుమానం ప్రజలకు పెనుబూతం లాగే కనిపిస్తుంది.
11 రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో తన పాత్రలేదని నిరూపించుకోవటం అవసరం ఎంతైనా ఉంది అది బాధ్యత కూడా! ఎందుకంటే న్యాయస్థానం కూడా భాదితునిలా, రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నట్లు ఎన్ఐఏకి కేసు బదిలీ చేస్తూ న్యాయనిర్ణయం చేసింది కాబట్టి.
12 ముందుగా రాష్ట్ర పోలీసుల గత విచారణకు సంబంధించిన విచారణ దస్త్రం ఎన్ఐఏకి యిచ్చి ఆ నేర విచారణ పూర్తి చేయటానికి సహకరించి – ఆ తరవాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలపై న్యాయస్థానంలోనో, శాసనసభలోనో, దేశవ్యాప్త ఉద్యమం ద్వారానో పోట్లాడి ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవం దక్కేది.
13 ప్రజలకు న్యాయవిచారణ సరిగానే జరిగింది అనే అభిప్రాయం కలిగించనప్పుడు అక్కడ పాలన సరిగా ఉందని అనలేము కదా!
14 విచారణ చేయటం ఎంత ముఖ్యమో – విచారణ సరిగానే జరిగిందనే అభిప్రాయం కలిగించటం దానికన్నా అన్నింటికన్నా ముఖ్యం.
15 ఒకరివెంట మరొకరు క్యూలైన్ లో ప్రభుత్వపక్షం ముఖ్యమంత్రి నుండి క్రిందిస్థాయి వరకు వెటకారం, ఎకసక్కెం, సెటైర్లు పరంపరగా వెయటమే ప్రజల్లో “అనుమానం పెనుభూతం" గా మారటానికి కారణం.
16 ఇప్పటికైనా సిట్ దర్యాప్తు దస్త్రం ఎన్ఐఏ కి అందించి విచారణ జరిగేలా చూడటం రాష్ట్ర ప్రభుత్వ విధి ముఖ్యంగా ముఖ్యమంత్రి బాధ్యత. ఇక్కడ రాష్ట్ర డిజిపి అన్నట్లు వైఎస్ జగన్ అభిమాని చేసిన హత్యాప్రయత్నం అని తేలాలన్నా విచారణ బాధితుని కోరిక ప్రకారం జరగవలసిందే కదా! ఆయన ఎవరో కాదు ముఖ్యమంత్రి లాగే ప్రజాప్రతినిధి కదా! న్యాయస్థానం కూడా అదే చెప్పింది కదా! ఇంకెందుకు తాత్సారం? సెంటర్ - స్టేట్ రిలేషన్షిప్ పై మీరు దీనికి సమాంతరంగా పోట్లాడవచ్చు కదా1