తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కెసిఆర్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ జాతీయ రాజకీయాల్లో ను మరియు రెండు తెలుగు రాష్ట్రాలలో ను దూసుకెళ్ళిపోతున్నరూ.
ఈ నేపథ్యంలో ఇటీవల స్పీకర్ను ఎన్నుకున్న కెసిఆర్ తెలంగాణ అసెంబ్లీలో ఆయనపై పొగడ్తల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఇంటి పేరు మరియు ఊరి పేరు గురించి మాట్లాడుతూ కెసిఆర్ అద్భుతంగా అసెంబ్లీలో ప్రసంగించారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ శ్రీనివాసరెడ్డి ఇంటిపేరు పోచారం కాదని, ఆయన ఇంటిపేరు పరిగె అని, స్వగ్రామం పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న గొప్ప వ్యక్తి ఆయనని సియం కేసిఆర్ వ్యాఖ్యానించారు.
ఈ రోజు అన్ని పేపర్లలో స్పీకర్గా పోచారం అని రాశారు, అంటే అంతగా ఊరు పేరు ఇంటి పేరుగా వచ్చేంత నిస్వార్ధ సేవను అందించారని సియం కేసిఆర్ అన్నారు. స్పీకర్గా తమరు ఎన్నికైన సందర్భంగా పోచారం గ్రామస్థులు ధన్యులయ్యారని అన్నారు. ఆయన ప్రజా జీవితంలో పరిపూర్ణ జీవితాన్ని అనుభవించారని, వినయశీలిగా, వివాద రహితుడిగా చక్కటి సేవలందించారని, వచ్చే ఫిబ్రవరి 10తో 70వ వసంతంలోకి అడుగు పెట్టనున్నారని అన్నారు.