దేశంలో మోడీ పాలనలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగిందని గతంలో కన్నా మోడీ హయాంలో జరిగిన అభివృద్ధి ప్రపంచ దేశాలకు తెలిసిన పేర్కొన్నారు. మోడీ పాలనలో ప్రపంచ స్థాయిలో శాసించే దేశాల పక్కన భారత్ చేరిందని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

Image result for rajnath singh

గతంలో దివంగత ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో భారత దేశం మహా శక్తిగా తీర్చిదిద్ది ప్రపంచంలోనే భారత్ కు స్థానం విశిష్టత కల్పించగా..అదే సంస్కరణలతో బీజేపీ దేశాన్ని అభివృద్ధి చేస్తోందన్నారు. రాయలసీమ జిల్లాలకు సంబంధించి బీజేపీ శక్తి కేంద్ర ప్రముఖ్ సమ్మేళన్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడకు వచ్చిన రాజ్‌నాథ్‌ సింగ్‌.. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన అనంతరం ప్రసంగాన్ని ప్రారంభించారు.

Related image

శాంతిభద్రతలు కాపాడేందుకు మోదీ ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తోందని చెప్పారు. కాంగ్రెస్‌తో జతకట్టిన పార్టీలు బతికి బట్టకట్టలేవని విమర్శించారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

Image result for rajnath singh

ఏపీలో ఏ ప్రభుత్వం ఉన్నా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలో మోడీ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి విపక్ష పార్టీలు తట్టుకోలేకపోతున్నారని రానున్న ఎన్నికల్లో బిజెపి ని గద్దె దించడానికి చాలా పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని వాటికి దేశ ప్రజలే సమాధానం చెబుతారని కామెంట్లు చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: