విభజనతో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని 2014 ఎన్నికల సమయంలో ఆదుకుంటామని తెలియజేసి ఆ తర్వాత చేతులెత్తేశారు అంటూ బిజెపి పార్టీ పై సంచలన కామెంట్లు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు.
ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఒక పక్క ప్రజలతో మరోపక్క పార్టీ నాయకులతో బిజీ బిజీగా గడుపుతున్న చంద్రబాబు తాజాగా ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలతో టెలికాన్ఫరెన్లో మాట్లాడుతు ఏపికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చామని బిజపి అనడం హాస్యాస్పదమని అన్నారు.
29 సార్లు ఢిల్లీకి వెళ్తే మొండిచేయి చూపడమే స్పెషల్ ట్రీట్మెంటా అని అన్నారు. గాయాలపై కారం జల్లడమేనా స్పెషల్ ట్రీట్మెంటా అని నిలదీశారు. దేశంలోని ఆలయాల్లో అశాంతిని బిజపి సృష్టిస్తోందని విమర్శించారు.
శబరిమలలో ఉద్రిక్తతలు రెచ్చగొడుతోందని, రామాలయాన్ని మళ్లీ తెరమీదకు తెస్తోందని, కర్ణాటకలో బిజపి దుర్మార్గ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. దేశాన్ని ఇటువంటి విధంగా విచ్చిన్నం చేసే పార్టీలు లేకుండా రాష్ట్రంలో బాగా కష్టపడాలని ప్రజల మన్ననలను అందుకోవాలని టిడిపి నేతలకు సూచించారు. ఇటువంటి ఆలోచన ధోరణి గల పార్టీలు దేశంలో ఉంటే ప్రజాస్వామ్యానికే రక్షణ ఉండదని పేర్కొన్నారు చంద్రబాబు.