దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తీస్తున్న బయోపిక్ ‘యాత్ర’ లో జగన్మోహన్ రెడ్డి కనిపించనున్నట్లు సమాచారం. యాత్రలో వైఎస్ పాత్రను ప్రముఖ మళయాళ నటుడు మమ్ముట్టి నటిస్తున్న విషయం తెలిసిందే. యాత్ర బయోపిక్ నిర్మాణం దాదాపు పూర్తియిపోయినట్లు సమాచారం. బయోపిక్ లో ప్రధానంగా వైఎస్ 2003లో చేసిన పాదయాత్రే హైలైట్ గా నిలుస్తోందనటంలో సందేహం లేదు. ఇటీవలే జగన్ కూడా పాదయాత్రను ముగించిన విషయం అందరికీ తెలిసిందే. నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసుకుని ఫిబ్రవరిలో విడుదలకు రెడీ చేస్తున్నారు.

 

ఆ యాత్ర సినిమాలో జగన్ పాదయాత్ర దృశ్యాలను కూడా చూపించబోతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. వైఎస్ పాత్రలో మమ్మట్టి కొడుకుగా కొన్ని సన్నివేశాల్లో జగన్ కనిపించనున్నట్లు సమాచారం. మరి ఆ సన్నివేశాలేంటి, ఏ సందర్భంలో సదరు సన్నివేశాలను తీశారన్న విషయాలను మాత్రం చిత్ర యూనిట్ బయటపెట్టలేదు. మొత్తం మీద యాత్ర బయోపిక్ లో జగన్ కొన్ని సన్నివేశాల్లో కనిపించటం మాత్రం ఖాయమని అర్ధమైపోయింది. కాబట్టి వైఎస్ కుటుంబాన్ని అభిమానించే వాళ్ళకు, వైఎస్సార్సిపీ శ్రేణులకు పండగే పండగ


మరింత సమాచారం తెలుసుకోండి: