వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు ఓటర్లపై వలలు విసురుతూనే ఉన్నారు. మొన్నటికి మొన్న పింఛన్ రెట్టింపు చేసేశారు. ఇప్పుడు రైతు బంధు తరహా స్కీమ్‌ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఆయన మహిళా ఓట్లపైనా దృష్టి పెట్టారు.

Image result for chandrababu dwacra ladies


అందుకే ప్రతి డ్వాక్రామహిళకు పదివేల రూపాయలు అందించాలని నిర్ణయించారు. అంతే కాదు.. ప్రతి డ్వాక్రామహిళకు ఓ స్మార్ట్ ఫోన్ కూడా ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై నిర్ణయం తీసేసుకున్నారట. ఓ భారీ సభలో ఈ నిర్ణయం ప్రకటిస్తారట.

Image result for chandrababu dwacra ladies


వైఎస్‌ జగన్ ఇంతకుముందే నవరత్నాలు పేరిట తాను అధికారంలోకి వస్తే చేసే స్కీములను ముందే ప్రకటించేశారు. ఇప్పుడు చంద్రబాబు వాటిలో ఒక్కొక్కదాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ తాజా స్కీమ్ కూడా జగన్ ప్రకటించిన నవరత్నాలలోని స్కీమ్ గానే కనిపిస్తుంది.

Related image


జగన్ కూడా డ్వాక్రా మహిళలకు ఆర్ధిక సాయం చేస్తానని ప్రకటించారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయడు డ్వాక్రా మహిళల రుణాలు మొత్తాన్ని మాఫీ చేస్తామని హామీ ఇచ్చినా అది పూర్తిస్థాయిలో అమలు కాలేదు. మరి ఇప్పుడు ఈ పదివేలు, స్మార్ట్ ఫోన్ పథకం అమలు చేసి చూపితే మహిళల ఓట్లన్నీ టీడీపీకి పడిపోతాయా.. ఏమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: