తెలంగాణ సీఎంగా రెండోసారి ఎన్నికైన కేసీఆర్ కన్ను జాతీయ స్థాయిలోని కీలకమైన పదవిపై పడిందా.. కేటీఆర్ కు సీఎం పదవి అప్పగించేసి తాను ఢిల్లీలో ఆ పదవిలో కూర్చోవాలనుకుంటున్నాడా.. అందుకోసమే.. ఫెడరల్ ఫ్రంట్ కట్టాడా.. జగన్ తో దోస్తీ కూడా అందుకోసమేనా.. అవునంటున్నారు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ.
ఇంతకీ కేసీఆర్ కన్నేసిన ఆ పదవి ఏంటో తెలుసా.. ఉప ప్రధాని అట. టీఆర్ఎస్ వచ్చేఎన్నికల్లో 16 వరకూ ఎంపీ సీట్లు గెలుచుకోవచ్చని కేసీఆర్ ఫీలవుతున్నారట. అలాగే జగన్ కు వచ్చే ఎంపీ పైచిలుకు సీట్లతో కేంద్రంలో కేసీఆర్ చక్రం తిప్పాలనుకుంటున్నారట. అందుకే జగన్కు వచ్చే ఎన్నికల్లో అన్నిరకాలుగా సహాయం చేయాలని నిర్ణయించారట.
ప్రధాన మంత్రి పదవిపై రాహుల్ గాంధీ, మాయావతి, మమతా బెనర్జీ వంటివారు ఆశలు పెట్టుకున్నందు వల్ల కేసీఆర్ ఆ రేసులో లేరని రాధాకృష్ణ అంచనా వేస్తున్నారు. అందుకే కుదిరితే ఉప ప్రధాని కావాలని కేసీఆర్ అభిలషిస్తున్నారట. తన ఉపప్రధాని కోరిక నెరవేరాలంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డికి అత్యధిక ఎంపీ స్థానాలు దక్కాలి కాబట్టి జగన్కు కేసీఆర్ సాయం చేస్తాడట.
అందుకే వచ్చే ఏపీ ఎన్నికల్లో జగన్కు అవసరమైన మార్గదర్శకత్వం చేయడంతో పాటు ఆర్థికంగా అండదండలు అందించడానికి కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చారట. దీనికే వారు ‘రిటర్న్ గిఫ్ట్’ అని పేరు పెట్టుకున్నారట. ఇదీ ఏబీఎన్ రాధాకృష్ణ విశ్లేషణ. కానీ అసలు ఉప ప్రధాని అనే పదవిని టార్గెట్ చేసుకుని కూడా రాజకీయాలు ఉంటాయా.. ఏమో.. ఇది ఆయనకే తెలియాలి.