జగన్ మీద ప్రాణహాని లేని హత్యాయత్నం జరుగుతుందని నటుడు శివాజీ గరుడ పురాణం చెప్పిన సంగతి తెలిసిందే. అయితే జగన్ కేసు ను విచారిస్తున్న ఎన్ ఐ ఏ ఇప్పడూ తమ దృష్టిని శివాజీ మీదకు మరల్చనున్నది. అయితే శివాజీ మాటలు మొదట్లో కామెడీ అనుకున్నారు గాని జగన్ మీద హత్యాయత్నం తర్వాత మాత్రం ఇతడి తీరు వివాదాస్పదం అయ్యింది. ఆ ఘటన జరిగే సమయానికి, ఘటన జరిగిన తర్వాత ఇతడు చాన్నాళ్ల పాటు ఏపీ వైపు రాలేదు.
అమెరికాలో కూర్చున్నాడట. ఇతడు చిలకజోస్యంలా చెప్పిన గరుడపురాణం కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది. జగన్ పై హత్యాయత్నం కేసులో విచారణ జరుపుతున్న ఎన్ఐఏ ఇప్పుడు ఇతడిని విచారించడం కూడా తప్పనిసరి అని తెలుస్తోంది. ఇతడిని ఎన్ఐఏ విచారించడంతోనే అసలు కథ మలుపు తిరుగుతుందనే మాట వినిపిస్తోంది. దాడి జరుగుతుంది నీకెలా తెలిసింది? అనే ప్రశ్న ఒక్కటీ చాలు ఈ కేసు మలుపు తిరగడానికి.
దానికి ఎన్ఐఏ అధికారులు తమదైన రీతిలో విచారించి సమాధానం రాబడితే.. ఆ తర్వాత కొన్ని పెద్దతలలు ఈ కేసు విచారణ పరిధిలోకి వస్తాయని సమాచారం. అందుకే.. వీలైనంత త్వరగా ఈ కేసులో ఎన్ఐఏ విచారణను ఆపించాలనే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ కేసులో ఎన్ఐఏ విచారణ ఆపాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ రేపు కోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది.