2019 ఎన్నికలు దగ్గర పడుతుండటం తో చంద్ర బాబు సర్వేలు , ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఒకటి కి పది సార్లు తెప్పించుకొని విజయావకాశాలను , అభ్యర్థులను అంచనా వేస్తున్నాడు. అయితే దీంతోపాటు.. కొన్ని ఇంటెజిజెన్స్ సర్వేలు - సీక్వెల్ సర్వేలు కూడా వ్యక్తిగతంగా తెప్పించుకుంటారు. రాబోయే ఎన్నికల్లో సిట్టింగులకు సీట్లు ఇవ్వాలా వద్దా - ఇస్తే ఎవరికి ఇవ్వాలి - ఎవరిని తప్పించాలి అనే విషయాలపై చంద్రబాబు దగ్గర రిపోర్ట్ సిద్ధంగా ఉన్నదట. ఇప్పుడు ఈ సర్వే రిపోర్ట్ ప్రకారమే... అభ్యర్థులకు సీట్లు ఇవ్వబోతున్నారట చంద్రబాబు.

Image result for chandra babu

చంద్రబాబు దగ్గరున్న ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం.. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల పరిస్థితి చాలా ఘరోంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికితోడు.. చంద్రబాబు సొంతంగా చేసుకున్న సర్వే ఫలితాలు కూడా ఇంచుమించుగా ఇదే విధంగా ఉన్నాయని సమాచారం. దీంతో.. ఎన్నికలు అంటేనే చంద్రబాబు భయపడిపోతున్నారట. అందుకే ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా సమావేశం అవుతున్నారు.

Image result for chandra babu

ఒకవేళ ఒక ఎమ్మెల్యేకు ఇంటిలిజెన్స్ రిపోర్ట్ మార్కులు బాగా తక్కువుగా వచ్చి ఉంటే... నిర్మోహమాటంగా పార్టీ టిక్కెట్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నారట చంద్రబాబు. మరోవైపు కాస్త ఫర్వాలేదు అని రిపోర్ట్ వచ్చిన ఎమ్మెల్యేలకు మరింతగా కష్టపడాలని - ఈ నాలుగు  నెలలు నియోజకవర్గంలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేస్తున్నారట. ఒక్క బుధవారమే దాదాపు 15 మంది ఎమ్మెల్యేలతో చంద్రాబాబు మాట్లాడారు. ఈ 15 మందికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ వచ్చే అవకాశాలే లేవని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: