ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనివిని ఎరుగని హామీలను ప్రకటిస్తూ ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు మొదలు పెట్టింది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కువగా ప్రజలతోనే ఉంటూ గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో జరిగిన ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ జన్మభూమి మీటింగ్ లో మరియు ధర్మపోరాట దీక్షలో ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు.
ఒక పక్క రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి తన తనయుడు మంత్రి నారా లోకేష్ చేత విదేశాలలో అనేక ప్రముఖ కంపెనీల చేత మంతనాలు జరుపుతూ మరోపక్క ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇటు ప్రజలను ఆకట్టుకుంటూ మరోపక్క ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు చంద్రబాబు.
ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పడుతున్న కష్టాన్ని చూసి టిడిపి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మీడియాతో మాట్లాడుతు మహిళలంతా మళ్లీ చంద్రబాబే సిఎం కావాలని కోరుకుంటున్నారని అన్నారు.
సర్వేల పేరుతో మోడి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ముగ్గురు మోడిలు కలిసి ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్లీ చంద్రబాబే సిఎం అవుతారని డొక్కా స్పష్టం చేశారు. ఏది ఏమైనా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్న నాయకులకు ఏపీ ప్రజలు దిమ్మతిరిగిపోయే తీర్పు ఇస్తున్నట్లు టిడిపి ఎమ్మెల్సీ డొక్కా వ్యాఖ్యానించారు.