రాయలసీమ జిల్లాలో అనంతపురం జిల్లా రాజకీయం అంటే అందరికీ ఆసక్తిగా ఉంటుంది. ప్రస్తుతం ఈ జిల్లాలో ఇటీవల టిడిపి నాయకుడు పార్లమెంటు సభ్యుడు అయిన జెసి దివాకర్ రెడ్డి మరియు ఆ ప్రాంతంలో పోలీసు అధికారిగా పనిచేసిన గోరంట్ల మాధవ్ మధ్య ఇటీవల చాలా వివాదాలు నెలకొన్నాయి.

Related image

మీడియా సమక్షంలో ఇరువురు ఒకరికి ఒకరు వార్నింగ్ ఇచ్చుకుంటూ చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాలలో కలకలం సృష్టించాయి. ఈ నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసిన గోరంట్ల మాధవ్ తాజాగా ఇటీవల జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు.

Image result for jc diwakar gorantla madhav

అయితే తాను సీఐ పదవికి రాజీనామా చేసి రావాలని మాధవ్‌ను వైఎస్‌ఆర్‌సిపి హైకమాండ్‌ కోరడంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి నేడు వైఎస్‌ఆర్‌సిపిలో చేరారు. గతంలో మాధవ్ సాక్షాత్తు అధికార పార్టీ ఎంపీపైనే మీసం మెలేసి సంచలనం సృష్టించారు.

Image result for jc diwakar gorantla madhav

పోలీస్‌శాఖలో కానిస్టేబుల్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించింది మొదలు ఆయన వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. రాజకీయాలను అడ్డంపెట్టుకొని దందాలు చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తారనే పేరుంది. ఆ కమిట్‌మెంట్, నిజాయితీలే ఆయనకు ప్రజల్లో ఎక్కడలేని క్రేజ్ తెచ్చిపెట్టాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: