హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయబోతోందా.. అందులోనూ ఆమె తనకు బాబాయి వరసయ్యే ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై పోటీకి దిగుతుందా.. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న విశ్వేశ్వర్ రెడ్డిపై టీఆర్‌ఎస్ తరపు నుంచి ఉపాసన బరిలో దిగుతుందా..?

 రాజకీయ ఆరంగేట్రంపై స్పందించిన ఉపాసన

ఈ అంశాలపై సోమవారం పలు పుకార్లు షికారు చేశాయి. ఓ ఆంగ్ల పత్రిక ఈ అంశంపై కథనం వెలువరించడంతో అంతా నిజమే అనుకున్నారు. రామ్ చరణ్, ఉపాసనలకు కేటీఆర్‌ తో మంచి దోస్తీ ఉండటంతో ఈ వార్త నిజమే కావచ్చని అంతా భావించారు

konda vishweshwar reddy కోసం చిత్ర ఫలితం


అందులోనూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇటీవలే టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరారు. అందుకే తప్పుకుండా అతడిని ఓడించేందుకు బలమైన అభ్యర్థిని పెట్టాలని భావించిన టీఆర్ఎస్ ఉపాసనను రంగంలోకి దింపుతుందేమో అనుకున్నారు. కానీ ఇవన్నీ వట్టి పుకార్లు మాత్రమేనని ఉపాసన క్లారిటీ ఇచ్చారు.

upasana kamineni కోసం చిత్ర ఫలితం


తాను ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం తాను తన జాబ్ ను ప్రేమిస్తున్నానని చెబుతోందిఅంతే కాదు.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి భార్య సంగీతా రెడ్డి తన బాస్ అని.. తన చిన్నాన్న చక్కగా ప్రజాసేవ చేస్తున్నాడని ప్రశంసించింది. అంటే సదరు ఆంగ్ల పత్రిక రాసిందంతా గాలికబురే అన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: