2014 ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారపర్వంలో భాగంగా మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీల విషయంలో అలాగే విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయంగా రావలసిన హామీల విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఏపీ ప్రజలను దారుణంగా మోసం చేసిందని తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఇటీవల కామెంట్లు చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే.

Image result for chandrababu

ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో దీక్షలు చేస్తూ అసలు నాలుగు సంవత్సరాలు కేంద్రం రాష్ట్రానికి ఏ విధమైన నిధులు కేటాయించింది వంటి విషయాలను సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరిస్తున్నాడు.

Image result for chandrababu

ఈ క్రమంలో చంద్రబాబు తాజాగా అఖిలపక్షం నిర్వహించబోతున్న ట్లు ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన అన్యాయం పై కేంద్రంపై టిడిపి రాజీలేని పోరాటం చేస్తుందని చంద్రబాబు అన్నారు. ఢిల్లీపై ఒత్తిడి తేవాలి, ప్రజల హక్కులను కాపాడాలని బాబు పేర్కొన్నారు.

Image result for chandrababu

కేసుల మాఫీ కోసం రాజీపడింది వైఎస్‌ఆర్‌సిపి అని విమర్శించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన వారితో జగన్ కుమ్మక్కైందని ఆరోపించారు. ఫిబ్రవరి 1న కేంద్రం పెట్టేదే ఆఖరి బడ్జెట్ అని, అప్రాప్రియేట్ బిల్లు ముందురోజే ఢిల్లీలో దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. ఏపీకి న్యాయం చేసేదాకా పోరాటం ఆగదని  చంద్రబాబు స్పష్టం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: