ఎన్నికల్లో ఎలాగైనా తిరిగి అధికారం అందుకోవాలని భావిస్తున్న చంద్రబాబు జనంపై వరాల వర్షం కురిపించే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని వర్గాలకూ వరుసగా వరాలు ప్రకటిస్తున్నారు. డ్వాక్రా మహిళల ఓట్ల కోసం పదివేల రూపాయల నగదు, స్మార్ట్ ఫోన్ ఇస్తామంటున్నారు.

CHANDRABABU DWAKRA LADIES కోసం చిత్ర ఫలితం


ఈ ప్రకటనతో మహిళల ఓట్లన్నీ చంద్రబాబు ఖాతాలో పడటం ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు ఇస్తున్న పది వేలు నగదు కాదు.. పోస్ట్ డేటెడ్ చెక్కులట. అవి కూడా మూడు విడతలుగా ఇస్తారట.

CHANDRABABU DWAKRA LADIES కోసం చిత్ర ఫలితం


ఇప్పటికే డ్వాక్రా రుణాల మాఫీల విషయం చంద్రబాబు మహిళలను మోసగించారన్న అపవాదు ఉంది. ఇప్పుడు కూడా చంద్రబాబు మహిళలను చెక్కుల పేరుతో మోసగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మహిళలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

CHANDRABABU DWAKRA LADIES కోసం చిత్ర ఫలితం


అదే జగన్‌ అధికారంలోకి వస్తే ఏకంగా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించాడు. అదీ ఏకమొత్తంలో చేస్తామన్నాడు. కాబట్టి మహిళలు చంద్రబాబు, జగన్ పథకాలను ఒక్కసారి బేరీజు వేసుకుంటే జగన్ వైపే మొగ్గు చూపే ప్రమాదం ఉంది. సో.. చంద్రబాబు డ్వాక్రా మహిళలకు పది వేలు ఇచ్చే ఆలోచన చేసి జగన్ నెత్తిన పాలు పోసినట్టు కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: