ఇటీవల మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి అన్ని పార్టీల మీటింగ్ సమావేశంలో విభజన హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టింది దానికి వ్యతిరేకంగా వ తీర్మానాన్ని ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో రాష్ట్రానికి ఏ విధంగా అన్ని పార్టీలు కలిసి పోరాడితే సమస్య పరిష్కారం అవుతుంది వంటి విషయాల గురించి చర్చించడానికి ఉండవల్లి అరుణ్ కుమార్ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు.
ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఉండవల్లి అరుణ్ కుమార్ పై సంచలన కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడదీసారని అన్న అంశం మీద కాకుండా మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం పట్ల ప్రతీ ఒక్కరు ముందుకు రావాలని తెలిపారు.
అదే సందర్భంలో పార్లమెంటులో ఆంధ్రులను లాగి పెట్టి చెంప దెబ్బలు కొట్టినా వారికి పౌరుషం లేదు,చచ్చు దద్దమ్మలు అని ఇతర పార్టీల నేతలు అన్న మాటలు వారు కొట్టిన దెబ్బలు పడి తెలంగాణా ఎంపీలకు ఉన్న పౌరుషం ఆంధ్ర ఎంపీలకు లేదు అని ఇతర రాష్ట్రాల ఎంపీలు అన్నపుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పడ్డ ఆందోళన ఆవేదనకు ప్రతీకగా పెట్టిన తీర్మానానికి తాను జనసేన పార్టీ తరపున వ్యక్తిగతంగా మద్దతు ఇస్తున్నానని పవన్ వ్యాఖ్యానించారు.