కే ఏ పాల్.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఈ పేరు బాగానే వినిపిస్తోంది. 2014 ఎన్నికలకు ముందే ఈ మతప్రబోధకుడు ప్రజాశాంతి పేరుతో పార్టీ పెట్టినా ఎన్నికల తర్వాత పత్తా లేకుండా పోయాడు. ఇప్పుడు మళ్లీ ఎన్నికల సమయంలో హడావిడి చేస్తున్నాడు.
తనపై తనకున్న విశ్వాసంతో ఆయన చెప్పే మాటలు చూసేవారికి సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తాయి. అందుకే టీవీ ఛానళ్లు ఇటీవల కేఏ పాల్ ను ఎక్కువగా లైవ్ లోకి తీసుకొస్తున్నాయి. ఇక మెరుగైన సమాజం కోసం అని చెప్పుకునే ఛానల్ కూడా పాల్ ను లైవ్ లోకి తీసుకొచ్చింది.
వైసీపీ లో చేరిన సినీ ఆర్టిస్ పృధ్వీ.. పాల్ పై చేసిన కామెంట్స్ నేపథ్యంలో పాల్ పై డిస్కషన్ స్టార్ట్ చేసింది. దీనికి ఇండస్ట్రీ క్వశ్చన్స్ అని టైటిల్ పెట్టింది. కేఏ పాల్ ను పృధ్వీని టైటిల్ కార్డ్ లో పక్కపక్కన వేసింది. ఇది చూసి డిస్కషన్ లో పాల్గొన్న కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పృధ్వీ లాంటి జోకర్ల పక్కన తన ఫోటో పెట్టి తన స్థాయిని తగ్గించవద్దన్నాడు కే ఏ పాల్.. అదే జగన్ను అంటే అలా జోకర్ల పక్కన ఫోటో పెడతారా.. జగన్ను ఇలా చేస్తే దున్నేస్తాడు.. మరి నన్నెందుకు అలా జోకర్ల పక్కన చూపిస్తున్నారు. నాకు జగన్ కు ఇచ్చే గౌరవమే ఇవ్వండి అంటూ ఛానల్ యాంకర్ను కడిగేశాడు. మీకు దమ్ముంటే జగన్ను అలా చూపిస్తూ టైటిల్ కార్డు వేయండి అంటూ సవాల్ విసిరాడు కే ఏ పాల్. పాపం మెరుగైన సమాజం ఛానల్ యాంకర్ నుంచి మాత్రం స్పందన కనిపించలేదు.