ఈ మద్య ఆంధ్రప్రదేశ్ లో బాగా పాపులర్ అయిన పదం కోడి కత్తి. ఏపి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై శ్రీనివాసరావు అనే యువకుడు కోడి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో వైఎస్ జగన్ భుజానికి గాయం అయ్యింది. అయితే ఈ కేసు విచారణలో ఎన్నో మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. నేడు ఏపి అసెంబ్లీలో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు. ఈ మద్య ఫెడరల్ ఫ్రంట్ వేదికగా కేసీఆర్, జగన్ కలిసి ఇక్కడ రాజకీయం చేయబోతున్నారని విమర్శించారు.
మొన్నటి వరకు ఎన్టీయేలో ఉన్న తాను యూటర్న్ తీసుకున్నానని ఆరోపిస్తున్నారు..కానీ తనది ఎన్నటికీ రైట్ టర్నేనని వ్యాఖ్యానించారు. టీడీపీ చేస్తున్నది ధర్మపోరాటమనీ, అందులో అంతిమ విజయం తమదేనని స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీలో ఈరోజు మాట్లాడిన చంద్రబాబు.. కేంద్రంతో పాటు వైసీపీ, టీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. బీజేపీ జగన్ మాత్రమే కాకుండా ఆర్థిక నేరగాళ్లందరినీ కాపాడేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడినందుకు ఇప్పుడు నోటీసులు పంపించి వేధిస్తున్నారని విమర్శించారు.
మరోవైపు నన్ను ఇబ్బంది పెట్టడానికి కోడి కత్తి కేసు తెరపైకి తీసుకు వచ్చారని. కోడి కత్తి కేసులో ఎన్ఐఏకు జోక్యం చేసుకునే అధికారం లేదన్నారు. జగన్ పై దాడి వ్యవహారంపై స్పందిస్తూ..‘ ఆ కోడి కత్తి కేసులో ఎన్ఐఏ అధికారులకు ఏమైనా దొరికిందా? కోడి గుడ్డుపై ఈకలు పీకారు. ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ ఏది చెప్పిందో, ఎన్ఐఏ అధికారులు కూడా అదే చెప్పారు’ అని చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.