చంద్రబాబు నాయుడు కారణంగానే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు విమర్శించారు. ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీని అంగీకరించింది కూడా చంద్రబాబు మాత్రమేననీ, దానిని అమలు చేయటం రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యం కాలేదని అగ్గిమీద గుగ్గిలమే అయ్యారు.  


ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్మోహనరెడ్డిపై విశాఖ ఎయిర్-పోర్ట్ లో జరిగిన దాడి ఘటనపై దర్యాప్తుకు టీడీపీ ఎందుకు భయపడుతోందని ఆయన ప్రశ్నించారు. నేడు (శుక్రవారం) మాణిక్యాలరావు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎవరిపై సీబీఐ దాడులు జరిపినా సోదాలు చేసినా ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోందని ప్రశ్నించారు. 
 BJP MLA Manikyala Rao Fires On Chandrababu Naidu - Sakshi
ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా నిధులు మంజూరు చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష పార్టీ గెలిచిన నియోజకవర్గాలకు నిధులు నిలుపుదల చేస్తోందని అన్నారు. దేశంలో ఒక రాష్ట్రంగా ఏపి అభివృద్ధి చెందాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు. చందబాబు కారణంగా ఏపీకి ఇంత అన్యాయం జరగుతుంటే తాము చాలా బాధ పడుతున్నామని విచారం వ్యక్తం చేశారు. తమకు కూడా రోషం ఉందని, కానీ అది రాజకీయ రోషం మాత్రం కాదని, నిజమైన రోషమని మాణిక్యాలరావు పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: