ఈ రోజు ఉదయం 11 గంటలకు లోక్ సభలో 201920 మధ్యంతర బడ్జెట్ ప్రతిపాదనలను పీయుష్ గోయల్ ప్రవేశపెట్టారు. బ‌డ్జెట్‌లో భాగంగా దేశ ప్ర‌జ‌లంద‌ రికీ మోడీ స‌ర్కార్ వ‌రాల జ‌ల్లు కురిపించింది. సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రప్రభుత్వం రూపొందించిన చివరి బడ్జెట్‌ను రూపోందించినట్లు తెలుస్తుంది. ఇక బడ్జెట్ లోని ముఖ్యంశాలు : 

Image result for పియూష్ బడ్జెట్

- రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.
- అందరికీ ఇళ్లు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం.
- ఆర్థిక వృద్ధిలో శరవేగంగా దూసుకెళుతున్న ఇండియా.
- ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాం.
- 2018-19 ద్రవ్యలోటు అంచనా 3.4 శాతం.
- కరెంట్ అకౌంట్ లోటును 5.6 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించాం.
- మా ప్రభుత్వంలోనే పెరుగుతున్న ధరల నడ్డి విరిచాం.
- ద్రవ్యోల్బణాన్ని కిందకు తెచ్చేందుకు ఎన్డీయే కృషి ఫలించింది.
- గోకుల్ మిషన్ కు ఈ సంవత్సరం రూ. 750 కోట్ల కేటాయింపులు.
- కొత్త పెన్షన్ విధానానికి రూ. 500 కోట్ల  కేటాయింపు.
- 10 కోట్ల మంది కార్మికులకు పెన్షన్ స్కీమ్ తో లాభం.
- ఉజ్వల యోజన కింద 8 కోట్ల ఉచిత వంటగ్యాస్ కనెక్షన్లు.
- ముద్ర యోజనలో రూ. 7.23 లక్షల కోట్ల రుణాలు.
- గ్రాట్యుటీ లిమిట్ రూ. 10 లక్షల నుంచి రూ. 30 లక్షలకు 
- గో ఉత్పాదకతను పెంచడం కోసం సరికొత్త 'రాష్ట్రీయ కామ్ ధేన్ ఆయోగ్'
- పెన్షన్ విధానానికి మార్పులు.
- పెన్షన్ లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంపు.
- రూ. 15 వేల నెల జీతం ఉండే వేతన జీవులకు కొత్త పథకం.
- కొత్త పెన్షన్ విధానంలో నెలకు రూ. 3 వేలు అందిస్తాం. 
-రూ. 3 లక్షల కోట్ల విలువైన మొండి బకాయిలను రికవరీ చేశాం.
-బ్యాంకులకు రూ. 2.60 లక్షల కోట్ల మూలధన నిధులను అందించాం.
- ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ ఇబ్బందులను అధిగమిస్తున్నాయి.
-అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసుకువచ్చిన ఘనత నరేంద్ర మోదీదే.
-'స్వచ్ఛభారత్'ను అత్యంత విజయవంతం చేశాం.
-అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాం.
- ఉపాధి హామీ పథకానికి ఈ సంవత్సరం రూ. 60 వేల కోట్ల కేటాయింపులు.
- గ్రామ సడక్ యోజనకు రూ. 19 వేల కోట్లు.
-గడచిన నాలుగేళ్లలో 1.53 కోట్ల ఇళ్లను నిర్మించి ఇచ్చాం.
- మార్చి నాటికి దేశంలోని అన్ని ఇళ్లకూ విద్యుత్ సరఫరా.
-ఎల్ఈడీ బల్బులతో దేశంలో రూ. 50 వేల కోట్లను ఆదా చేశాం.
-ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంతో పేద, మధ్య తరగతి ప్రజలకు రూ. 3 వేల కోట్ల ఆదా.
- కొత్తగా ఏడు ఎయిమ్స్ ఆసుపత్రులను తీసుకువచ్చాం.
-హర్యానాలో కొత్త ఎయిమ్స్ రాబోతోంది.
-22 రకాల పంటలకు మద్దతు ధరను పెంచాం.
- ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులకు రూ. 6 వేలు ధనసాయం.
- ప్రతి ఏడాదీ పెట్టుబడి సాయం అందిస్తాం.
- మూడు ఇన్ స్టాల్ మెంట్ల ద్వారా డబ్బు అందుతుంది.
-చిన్న, సన్నకారు రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా డబ్బు.
- బ్యాంకుల రుణాలు రూ. 35,984 కోట్లకు పెరుగుదల.
-కిసాన్ క్రెడిట్ కార్డులపై 2 శాతం వడ్డీ రాయితీ.
-రక్షణ రంగానికి రూ. 3 లక్షల కోట్ల కేటాయింపు.
-కార్మికుల ప్రమాద బీమా రూ. 1.50 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పెంపు.
-60 ఏళ్లు దాటిన కార్మికులంతా పెన్షన్ స్కీమ్ లో భాగస్తులే.
-కొత్తగా 10 కోట్ల మంది వృద్ధులకు లబ్ధి.
-వన్ ర్యాంక్ - వన్య పెన్షన్ కోసం రూ. 35 వేల కోట్లు.
-త్వరలోనే 'వందే భారత్' ఎక్స్ ప్రెస్ రైలు పరుగులు.
-రైల్వేలకు బడ్జెటరీ సపోర్ట్ కింద రూ. 64,587 కోట్లు.
-మిజోరం, మేఘాలయా రాష్ట్రాలను రైల్వేతో అనుసంధానం.
-బ్రాడ్ గేజ్ మార్గాల్లో ఇప్పటికే తొలగిపోయిన కాపలాలేని లెవల్ క్రాసింగ్ లు.
-ఈశాన్య భారతావని కూడా మౌలికరంగ అభివృద్ధిని చూస్తోంది.
-ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రూ. 15,166 కోట్ల కేటాయింపు.
-గడచిన ఐదేళ్లలో సౌర విద్యుత్ ఉత్పత్తి 10 రెట్లు పెరిగింది.
-గడచిన ఐదేళ్లలో 34 కోట్ల జన్ ధన్ అకౌంట్ల ప్రారంభం.
-ప్రత్యక్ష పన్నుల ద్వారా ఆదాయం రూ. 12 లక్షల కోట్లు.
-80 శాతం పెరిగిన పన్ను చెల్లింపుదారుల సంఖ్య.
-ఆదాయపు పన్ను పరిమితి రూ. 5 లక్షలకు పెంపు.
-ఇప్పటి వరకూ ఉన్న పన్ను పరిమితి రూ. 2.50 లక్షలు
-సెక్షన్ 80సీ పరిమితి రూ. లక్ష నుంచి రూ. 1.50 లక్షలకు పెంపు.
-ఇక పేద, మధ్యతరగతి ప్రజలంతా 0 నుంచి 5 శాతం పన్ను పరిధిలో మాత్రమే.
-సినిమా పరిశ్రమ 12 శాతం జీఎస్టీ పరిధిలోకి.
-సినిమా షూటింగ్ అనుమతులకు సింగిల్ విండో.
-రోజుకు 27 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం.
-దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను వదిలే సమస్యే లేదు.
-అందరినీ ఇండియాకు రప్పించి బకాయిలు వసూలు చేస్తాం.
-బినామీ ఆస్తుల వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వాటిని అటాచ్ చేశాం.
-3 లక్షలకు పైగా బినామీ కంపెనీలను డీ రిజిస్టర్ చేశాం.
-గడచిన సంవత్సరం కోటి మందికి పైగా పన్ను చెల్లించారు.
-స్వతంత్ర భారతావనిలో ఇంతమంది నుంచి రిటర్నులు దాఖలు కావడం ఇదే తొలిసారి.
-వచ్చే ఐదేళ్లలో ఇండియా 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా రూపాంతరం చెందుతుంది.
-'ఈజ్ ఆఫ్ బిజినెస్' తో పాటే 'ఈజ్ ఆఫ్ లివింగ్'
-మరిన్ని విమానాశ్రయాలు రానున్నాయి.
-ఇన్ లాండ్ వాటర్ వేస్ కు పెద్దపీట.
-పట్టణాలను మరింత పరిశుభ్రం చేస్తాం.
-శాస్త్ర, సాంకేతిక, అంతరిక్ష రంగాలకు మరిన్ని కేటాయింపులు.
-డిజిటల్ ఇండియా కలను సాకారం చేసి చూపిస్తాం.
-అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, ఆర్థిక లావాదేవీలను డిజిటల్ మాధ్యమంగానే సాగేలా చర్యలు.
-ఇండియాను కాలుష్య రహిత భారతావనిగా మార్చేందుకు చర్యలు.
-ఎలక్ట్రిక్ వాహనాలకు మరిన్ని రాయితీలు.
-ట్రాన్స్ పోర్ట్ విప్లవంలో ప్రపంచానికే ఆదర్శంగా మారనున్న భారతావని.
-సరుకు రవాణా రంగంలోనూ ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం.
-ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహిస్తాం.
-గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామికీకరణకు సమయం ఆసన్నమైంది.
-మేకిన్ ఇండియాలో భాగంగా గ్రామాలకు భారీ పరిశ్రమలను దగ్గర చేస్తాం.
-గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా ఇప్పటికే మారిపోయిన ఇండియా.
-అంతరిక్ష కార్యక్రమాలకు మరిన్ని నిధులను కేటాయిస్తాం.
-ప్రపంచ దేశాల శాటిలైట్లను నింగిలోకి చేర్చడంలో మనమే ముందున్నాం.
-ఆహార ఉత్పత్తులను మరింత సేంధ్రీకరిస్తాం.
-పురుగు మందులు వాడని పంటతో మరింత ఆరోగ్యం.
-2025 నాటికి ప్రతి దేశ పౌరుడికీ ఆరోగ్య బీమా ఉంటుంది.
-వైద్య ఖర్చులకు ఒక్క రూపాయి కూడా పెట్టని పరిస్థితిని తీసుకు వస్తాం.
-ఇంటి అద్దెలపై టీడీఎస్ రూ. 180 లక్షల నుంచి రూ. 2.40 లక్షలకు పెంపు.
-ఇళ్ల కొనుగోలుదారులకు జీఎస్టీ మినహాయింపులో అతి త్వరలోనే నిర్ణయం.
-మంత్రివర్గ ఉపసంఘం నివేదికను జీఎస్టీ మండలి ముందు ప్రవేశపెట్టి చర్చించనున్నాం.
-జాతీయ విద్యా మిషన్ కు రూ. 38,572 కోట్లు.
-చైల్డ్ డెవలప్ మెంట్ స్కీమ్ కు రూ. 27,584 కోట్లు.
-ఎస్సీ, ఎస్టీల అభ్యన్నతికి రూ. 76 వేల కోట్లు.
-నెలకు వసూలవుతున్న పన్ను మొత్తం రూ. 97,100 కోట్లు.
-గడచిన ఐదేళ్లలో రాష్ట్రాల పన్ను వసూళ్లు సాలీనా 14 శాతం మేరకు పెరిగాయి.
-జీఎస్టీ అమలుతో వినియోగదారులపై రూ. 80 వేల కోట్ల భారం తగ్గింది.
-చాలా నిత్యావసర వస్తువులు 5 శాతంలోపు పన్ను పరిధిలోనే ఉన్నాయి.
-రూ. 5 లక్షలలోపు సంవత్సరాదాయం ఉన్న వారికి ఫుల్ టాక్స్ రిబేట్.
-వారు కేవలం రిటర్నులు దాఖలు చేస్తే సరిపోతుంది.
-రూ. 6.50 లక్షల వరకూ వార్షికవేతనం ఉంటే, పీఎఫ్, బీమా, సేవింగ్స్ తదితర స్కీముల్లో పెట్టుబడులు పెట్టి ఒక్క రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: