సీఎం చంద్రబాబు విపక్షం వైసీపీపై మరోసారి ఘాటు పదజాలంతో విరుచుకుపడ్డారు. కోడికత్తి కేసులో జగన్ డ్రామా ఆడుతున్నట్టు తేలిపోయిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర పోలీసులు ఏం చెప్పారో.. ఎన్‌ఐఏ కూడా అదే చెప్పిందని.. ఇప్పుడు జగన్ తల ఎక్కడ పెట్టుకుంటారని చంద్రబాబు విమర్శించారు.



వైఎస్ జగన్ చెల్లి షర్మిలపైనా చంద్రబాబు విరుచుకుపడ్డారు. జగన్ కోడికత్తి డ్రామా ఆడుతుంటే.. ఆయన చెల్లెలు షర్మిల ఇంకో డ్రామా ఆడుతున్నారంటూ మండిపడ్డారు. వీరిద్దరూ రాజకీయంగా దిగజారిపోయారని చంద్రబాబు ఆవేశంగా అన్నారు.



కేసీఆర్, మోడీ జగన్ కు సహకరిస్తున్నారని చంద్రబాబు అంటున్నారు. జగన్ దేశవ్యాప్తంగా దొంగ సర్వేల చేయించి టీడీపీకి సీట్లు రావని దుష్ప్రచారం చేస్తున్నారని.. ఇదంతా జగన్ మైండ్ గేమ్‌లో భాగమని చంద్రబాబు తన పార్టీ నేతలో అన్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని పార్టీ శ్రేణుల్లో అనుమానాలు అవసరం లేదని చంద్రబాబు అన్నారు.



జగన్ పై చంద్రబాబు విమర్శలను తప్పుబట్టాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో అది సాధారణమే కానీ.. జగన్ చెల్లెలు షర్మిల తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై పెట్టిన కేసును కూడా తప్పుబట్టడం విడ్డూరం. అందులోనూ డ్రామా అంటూ విమర్శించడం చంద్రబాబు స్థాయికి తగిన ప్రవర్తన కాదు.


మరింత సమాచారం తెలుసుకోండి: