గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ నాయకులు బిజెపి పార్టీ పై మీడియా ముందు తెగ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా విభజన హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని దారుణంగా మోసం చేసిందని తెలుగు జాతిని అవమాన పరిచింది అన్నట్టుగా టీడీపీ నేతలు గగ్గోలు పెట్టారు.

Image result for chandrababu

ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల దేశంలో బీజేపీయేతర ప్రభుత్వం ఉండాలని మోడీ అధికారంలోకి ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని దేశంలో మోడీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేయడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ఇదిలా ఉండగా తాజాగా ఇటీవల బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చంద్రబాబు పై మరియు ఆయన కుమారుడు ఏపీ మంత్రి నారా లోకేష్ పై సెటైర్లు వేశారు.

Image result for chandrababu amit shah

ఆంద్రప్రదేశ్ కు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఐదున్నర లక్షల కోట్ల రూపాయల నిదులు ఇస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం తన కొడుకు లోకేష్ ను రాస్ట్రానికి ఇచ్చారని బిజెపి అద్యక్షుడు అమిత్ సా ఎద్దేవ చేశారు.చంద్రబాబును నమ్మొద్దు. ఇచ్చిన నిధులన్నీ మింగేశారు.

Image result for chandrababu

వైసీపీ, టీడీపీ రెండూ కుటుంబ పాలనకు ఒడిగడుతున్నాయి. అవినీతిలో కూరుకుపోయాయి. వాటిని ఓడించాలి. గడచిన నాలుగున్నరేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని ఎన్ని నిధులిచ్చారో చెప్పడానికే వచ్చాను. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత.. పది అంశాల్లో పదేళ్లలో అందించాల్సిన సహకారాన్ని ఐదేళ్లలో అందించాం అని ఆయన అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: