ఏపీ సీఎం చంద్రబాబుకు మరో ఝలక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీలో చేరేందుకు సిద్ధమైన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వర్గం ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. టీడీపీలో చేరేందుకు సిద్దమై ఇప్పటికే కోట్ల ఫ్యామిలీ అమరావతి వచ్చి చంద్రబాబుతో సమావేశమైన సంగతి తెలిసిందే.

Image result for kotla surya prakash reddy


ఈ సమయంలో కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరడం ఖాయమే అనుకున్నారు అంతా. కానీ కేఈ ఫ్యామిలీతో రాజకీయ వైరం ఉన్న నేపథ్యంలో కేఈ, కోట్ల కుటుంబాలు రెండూ టీడీపీలో ఎలా ఇముడుతాయనే సందేహాలు మాత్రం కొనసాగాయి. దీనికి తగ్గట్టుగా కేఈ కూడా కోట్ల ఫ్యామిలీ రాకపై అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా.

Related image


ఈ నేపథ్యంలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అనుచరులు కూడా తమ నాయకుడి నిర్ణయంపై అసంతృప్తి చెందారట. టీడీపీలో కాకుండా వైసీపీలో చేరాలని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చారు. టీడీపీలో చేరిక అంత సానుకూలంగా లేకపోవడం వల్ల వైసీపీలో చేరేందుకు కోట్ల ఫ్యామిలీ ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.

Image result for kotla surya prakash reddy CHANDRABABU


తాజాగా మీరు టీడీపీలో చేరుతున్నారు కదా అని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి కొందరు విలేఖరులు ప్రశ్నించిన సమయంలో కోట్ల వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా కలకలం సృష్టిస్తోంది. నేను టీడీపీలో చేరుతున్నానని మీకు చెప్పానా అంటూ ఆయన మండిపడ్డారట. మొత్తానికి ఈ పరిణామాలన్నీ చూస్తే కోట్ల ఫ్యామిలీ జగన్ గూటికి చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: