ఏపీ సీఎం చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అంటే ఎవరైనా చెప్పే సమాధానం ఒక్కటే.. అది కుప్పం.. అక్కడి నుంచి ఆయన వరుసగా ఎన్నోసార్లు పోటీ చేసి విజయం సాధించారు. కుప్పం చంద్రబాబు పొలిటికల్ కేరాఫ్ అడ్రస్ అయ్యింది.



కానీ ఈసారి సీన్ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎదుకంటే.. చంద్రబాబు తనయుడు కూడా ఈసారి అసెంబ్లీ బరిలో ఉంటారు. మరి తనయుడుకి సేఫ్ ప్లేస్ చూడాలి కదా. కుప్పం ను మించిన సేఫ్ ప్లేస్ ఏదీ ఉండదని చంద్రబాబు బావిస్తున్నారు.



అందుకే ఈసారి కుప్పం నుంచి తాను కాకుండా.. లోకేశ్ ను బరిలో దింపాలని భావిస్తున్నారట. మరి చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు.. ఈ ప్రశ్నకు రాజధాని ప్రాంతం నుంచే అని సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే చంద్రబాబు పాలనలో ఎక్కువగా లాభపడింది ఈ ప్రాంతమే కాబట్టి.



అమరావతి పరిధిలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీకి దిగితే ఇబ్బంది ఉండదని చంద్రబాబు భావిస్తున్నారట. అన్నింటికంటే పెనమలూరు అసెంబ్లీ స్థానం అయితే ఢోకా ఉండదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సో.. ఈ సారి చంద్రబాబు పెనమలూరు నుంచి లోకేశ్ కుప్పం నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: