జీసన్ కొలువుతీరే చర్చిల్లో అరాచకాలు పెరుగుతున్నాయా.. చర్చిల్లో అత్యాచారాలు జరుగుతున్నాయా.. ప్రార్థానాలయాల్లో మహిళలు సెక్స్ బానిసలుగా మారుతున్నాయా.. చాలాకాలం నుంచి ఉన్న ఈ ఆరోపణలకు ఇప్పుడు మరోసారి బలం చేకూరింది.
చర్చిల్లో లైంగిక అరాచకాలు జరుగుతున్నాయని ఏకంగా పోప్ ఫ్రాన్సిస్ సంచలన కామెంట్స్ చేశారు. చర్చిల్లో సన్యాసినిలపై అత్యాచారాలు పెరిగాయని ఆయన వాటికన్ ఉమెన్స్ మేగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. దైవారాధన పేరుతో కొందరు పాస్టర్లు, బిషప్పులు రేపులు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే చర్చిల్లో ఈ అత్యాచారాలు కొన్ని శతాబ్దాల నుంచి జరుగుతున్నాయని చెబుతారు. కానీ క్రిస్టియానిటీలో ఉన్న కల్చర్ ఆఫ్ సైలన్స్ అండ్ సీక్రెసీ కారణంగా ఈ అరాచకాలు ప్రపంచానికి తెలియకుండా పోయాయట. అందుకే దాన్ని రద్దు చేశామని పోప్ తన ఇంటర్వ్యూలో తెలిపారు.
చర్చిల్లో జరుగుతున్న ఈ అరాచకాలకు అడ్డుకట్ట వేసేదిశగా ఆలోచిస్తున్నామని పోప్ ఫ్రాన్సిస్ తెలిపారు. ఇప్పటికే ఇలాంటి ఆరోపణలు ఉన్న చాలా మందిని వారి పదవుల నుంచి తొలగించామన్నారాయన. క్రైస్తవ పెద్దలు మహిళలను సెక్స్ బానిసలుగా చూసే మనస్తత్వం నుంచి బయటకు రావాలని ఆయన పిలుపు ఇచ్చారు.