లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేంది. ప్రతి పక్ష పార్టీ ని తిట్టబోయి తమ పార్టీ నే తిట్టే ఘనుడు. తెలుగుదేశానికి ఓటేస్తే మనకు మనం ఉరేసుకున్నట్టే అని పబ్లిక్ గా ప్రకటించిన అపర మేధావి. అలాంటి లోకేష్ మరోసారి దొరికిపోయారు. ఈసారి సోషల్ మీడియా సాక్షిగా లోకేష్ బుక్ అయ్యారు.ఎవరు వెలికి తీశారో కానీ, దాదాపు మూడేళ్ల కిందట లోకేష్ పెట్టిన ఓ ట్వీట్ ను సోషల్ మీడియాలో బయటకుతీశారు. సింపుల్ గా దాని సారాంశం ఏంటంటే.. "12 ఏళ్లలో అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ కలిసి హైదరాబాద్ లో మెట్రోరైలు కట్టలేకపోయారు. అధికారంలోకి వచ్చి 19 నెలలైన (మూడేళ్ల కిందట) టీడీపీ మాత్రం 2018 డిసెంబర్ నాటికి విజయవాడ మెట్రో పూర్తిచేస్తుంది.

పాపం లోకేష్.. మళ్లీ దొరికిపోయాడు!

అప్పుడు లోకేష్ పెట్టిన ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది. ఆల్రెడీ 2018 డిసెంబర్ ముగిసింది. బెజవాడలో మెట్రోరైలు ప్రాజెక్టు ఒక్క ఇంచీ కూడా ముందుకు కదల్లేదు. అసలు ఆ ప్రాజెక్టే అక్కడ రాదు. దీనిపై నెటిజన్లు సెటైరిక్ గా స్పందించారు. ఈసారి విజయవాడ వెళ్లినప్పుడు కచ్చితంగా మెట్రో ఎక్కుతానంటూ ఒకరు జోకేస్తే.. లోకేష్ అన్న నాకొక బాల్కనీ టికెట్ (మెట్రోలో) అంటూ మరొకరు అందుకున్నారు.

Image result for lokesh

ఇంతకీ మెట్రోరైలు రోడ్డుపైనే ఉందా.. కృష్ణానది కింద కట్టారా అంటూ మరొకరు సెటైర్. నాన్నకు చెప్పకుండా ట్వీట్ పెడితే ఇలానే దొరికిపోతావంటూ మరికొందరు అందుకున్నారు. ఇంకొందరు మాత్రం వ్యంగ్యంగా లోకేష్ ను సమర్థిస్తూ వస్తున్నారు. లోకేష్ అర్థంలో మెట్రో అంటే మెట్రోరైలు కాదట. మెట్రో షూ కంపెనీ, మెట్రో క్యాష్ అండ్ క్యారీ సూపర్ మార్కెట్ అంట. ఈ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం సక్సెస్ అయిందంటూ ఒకటే జోకులు. ఇలా ఒకటి కాదు, వందల సంఖ్యలో లోకేష్ పై సెటైర్లు పడుతూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: