తెలుగు రాష్ట్రాలు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అమల్లోకి వచ్చింది.  ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవిలోకి వచ్చారు.  అయితే ఏపీ సీఎంగా పదవిలోకి వచ్చే ముందు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారని..కానీ ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ప్రతిపక్ష పార్టీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వం 295  హామీలు అమలు చేసిందని, ఇచ్చిన హామీల కన్నా అధికంగా నెరవేర్చామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు.

విజన్ 2029 డాక్యుమెంట్ ను ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఈరోజు విడుదల చేశారు.  ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..2022 నాటికి మూడు అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా ఉండాలనేది, 2029 నాటికి దేశంలో అగ్రస్థానంలో ఏపీ ఉండాలనేది తమ లక్ష్యమని అన్నారు.  విజన్ 2020 వల్ల హైదరాబాద్ లో అద్భుత అభివృద్ధి సాధ్యమైందని అన్నారు. ఏపీలో కుటుంబ వికాసం, సమాజ వికాసం, సుస్థిర వృద్ధికి కృషి చేస్తున్నామని, ‘హ్యాపీనెస్’ గురించి మాట్లాడుతున్న ఏకైక ప్రభుత్వం తమదని అన్నారు.

ఆటోలపై జీవితకాల పన్ను, ట్రాక్టర్లపై త్రైమాసిక పన్ను మినహాయించామని, గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు మళ్లించామని, ఏలేరు ఆయకట్టుకు నీటి సమస్య లేకుండా చేశామని వివరించారు.కేంద్రం సహకరించకపోయినా పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని, జూన్ నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకొస్తామని, డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: