ఈ మద్య కొంత మంది డాక్టర్ల నిర్లక్ష్యంతో రోగులు ప్రాణసంకటంలో పడుతున్నారు.  ముఖ్యంగా రోగికి ఆపరేషన్ చేసిన తర్వాత కడుపులో కొన్ని వస్తువులు మర్చిపోయి కుట్లు వేసి మమా అనిపిస్తుంటారు. ఆ తర్వాత రోగి పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు..ఎక్స్ రే తీస్తే డాక్టర్లు చేసిన ఘనకార్యం బయట పడుతున్న సంఘటనలు ఎన్నో వెలుగు లోకి వచ్చాయి.

తాజాగా రోగికి ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మర్చిపోయిన వైద్యుడు నిర్వాకం వెలుగులోకి వచ్చింది.  వివరాల్లోకి వెళితే...హైదరాబాద్ నీమ్స్ లో  ప్రాణాలు కాపాడుకోవడానికి వెళితే ఉన్న ప్రాణాలు తీసేలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు కొందరు డాక్టర్లు. మహాదేవ్‌ అనే పేషంట్‌కు ఆపరేషన్‌ చేసిన కొందరు వైద్యులు.. కడుపులో కత్తెర మరిచిపోయారు.

కత్తెర కడుపులో ఉండగానే కుట్లు వేశారు. దాంతో రోగి కొన్ని రోజులుగా విపరీతమైన కడుపు నొప్పితో తల్లడిల్లి పోతుండగా..మెడిసెన్స్ వేసుకున్నా తగ్గక పోవడంతో ఎక్స్ రే తీయించారు.  ఆ ఎక్స్ రేలో దారుణమైన దృశ్యం కనిపించింది.  కడుపులో ఓ పెద్దసైజు కత్తెర కనిపించడంతో రోగా షాక్ కి గురుయ్యాడు.  వైద్యుల నిర్లక్ష్యంపై మహాదేవ్‌ బంధువులు ఆందోళనకు దిగారు.



మరింత సమాచారం తెలుసుకోండి: