ప్రధానమంత్రి మోడీకి ఏపీలో ఘోరమైన అవమానం జరుగుతోంది. గతంలో దేశంలో బహుశా ఏ ప్రధానమంత్రికి కూడా ఇలాంటి అవమానం జరిగి ఉండదు. ఒక రాష్ట్రానికి ప్రధాన మంత్రి వస్తున్నారంటే.. స్వాగత సత్కారాలు.. ఓ రేంజ్‌ లో ఉంటాయి. రాష్ట్రానికి ఇష్టం ఉన్నా లేకపోయినా అది ఫార్మాలిటీగా వస్తోంది.

Related image


కానీ ఈసారి ఏపీకి మోడీ వస్తుంటే.. కనీసం రాష్ట్రం తరపున స్వాగతం చెప్పేవారే లేరు. అంతే కాదు.. ఒకరోజు ముందుగానే మోడీ గో బ్యాక్ అంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. అంతే కాదు.. మోడీకి దారి పొడుగునా నిరసన కటౌట్లు, హోర్డింగులు ఏర్పాటు చేసారు.

Related image


ఏ ముఖం పెట్టుకుని ఏపీ వస్తారు అంటూ హోర్డింగులు ఏర్పాటు చేయడం బహుశా దేశంలో ఏ ప్రధానికీ ఇలాంటి నిరసన ఎదురై ఉండదేమో. మోడీపై పీకలదాకా కోపం ఉన్న చంద్రబాబు తన సైన్యంతో ఇలాంటి విన్యాసాలు చాలా చేయిస్తున్నారు. బీజేపీ నేతలు మాత్రం సాధ్యమైనంతగా ఘన స్వాగతం ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు.

Image result for modi go back in ap

మొన్నటి అమిత్ షా పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిన నేపథ్యంలో మోడీకి అలాంటి అవమానం జరగకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. భారీగా జనసేకరణ చేసి పరువు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. మోడీ గుంటూరు సభలో చంద్రబాబు గుట్టువిప్పుతారని బీజేపీ నేతలు చెబుతున్నారు. మరి ఈ యుద్ధం ఎటు దారి తీస్తుందన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: