గుంటూరు భహిరంగ సభలో మోడీ ... చంద్ర బాబు మీద నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. విజయవాడలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.తనను లోకేశ్ తండ్రి అని అనడంపై సీరియస్ అయిన చంద్రబాబు తాను లోకేశ్ తండ్రి అని చెప్పుకునేందుకు గర్వపడుతున్నానని అన్నారు. ఐతే…ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కుటుంబ బంధాల విలువ తెలియదన్నారు. ముస్లిం మహిళల సంక్షేమం పేరుతో.. ట్రిపుల్ తలాఖ్  బిల్లు తెచ్చిన ప్రధానమంత్రి… తన కుటుంబం నుంచి విడిపోవడాన్ని ప్రస్తావించారు.

Image result for chandrababu naidu

తాను లోకేశ్ తండ్రి అయితే… ప్రధానమంత్రి మోడీ జశోదా బెన్ భర్త అని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన గౌరవాన్ని పోగొట్టుకున్నారని విమర్శించారు. తన కుటుంబం గురించి మాట్లాడారు కాబట్టి తాను కూడా ఈ వ్యాఖ్యలు చేయాల్సి రావడం బాధగా అనిపిస్తోందని అన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారంటూ మోడీ చేసిన కామెంట్లకు బాబు కౌంటర్ ఇచ్చారు.

Image result for narendra modi

ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయడం చేతగాని మోడీ.. ఇక్కడకొచ్చి తిట్టి పారిపోయారని ఆరోపించారు. తాను ఎవరికీ వెన్నుపోటు పొడవలేదని.. మోడీనే తన గురువు అద్వానీకి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. గో బ్యాక్ అంటే.. ఢిల్లీలో మళ్లీ అధికారంలో కూర్చోమని కాదన్న బాబు.. మోడీ ప్రధాని సీట్లోంచి దిగిపోయి.. గుజరాత్ వెళ్లిపోవాలన్నారు. ఏపీకి ఎంతో చేశామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ గుంటూరులో చెప్పిన లెక్కలపై సీఎం చంద్రబాబు సమాధానమిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: