ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు కేఏపాల్ గురించి ఇప్పుడు ఎక్కడ చూసిన చర్చలు కొనసాగుతున్నాయి.  ప్రజాశాంతి పార్టీ స్థాపించిన ఆయన త్వరలో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు.  ఈ నేపథ్యంలో పలు రాజకీయ నాయకులనై తనదైన స్టైల్లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ టివి, యూట్యూబ్ ఛానల్స్ లో ఊదరగొడుతున్నారు.  అయితే కేఏపాల్ తల్లి కిలారి సంతోషమ్మ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. 

ఈ విషయాన్ని పలు మార్లు కేఏపాల్ మీడియా వేధికగా వెల్లడించారు.  తాజాగా  కేఏ పాల్ తల్లి కిలారి సంతోషమ్మ, గత రాత్రి కన్నుమూశారు. ఆమె వయసు 78 సంవత్సరాలు.  విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె, రాత్రి 8.30 గంటల సమయంలో మరణించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా కేఏ పాల్ స్వయంగా తెలియజేశారు.


ఆమె ప్రస్తుతం స్వర్గంలో మరింత మెరుగైన జీవనాన్ని గడిపేందుకు వెళ్లిందని వ్యాఖ్యానించారు. ప్రభువుతో ఆమె కలిసిపోయిందని చెప్పారు. తనకు సొంత ఇల్లు, సొంత కారు, కనీసం ఒక్క రూపాయి డబ్బు లేకపోయినా, పేదల బాగు కోసం ఆమె నిత్యమూ ప్రార్థించేవారని అన్నారు.  తన తల్లిగారే..తనను ప్రజాశాంతి పార్టీ పెట్టి ఎన్నికల్లో బరిలో నిలవాలని దీవించారని ఈ సందర్బంగా గుర్తి చేసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: