త్వరలో దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ గుంటూరులో రాష్ట్ర బిజెపి పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related image

ఈ సందర్భంగా ప్రధాని మోడీ చంద్రబాబు ప్రభుత్వం పై మరియు కేంద్రం రాష్ట్రానికి ఏ విధమైన సాయం చేసింది వంటి విషయాలను తెలియ జేస్తూ సంచలన కరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా గత నాలుగు సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అందించిన నిధులకు సంబంధించి లెక్కలు చెప్పమని అడిగితే తన నుంచి దూరంగా పారిపోతున్నారని  ఏపీ సీఎం చంద్రబాబును విమర్శించారు.

Related image

ఎన్టీఆర్ రాజకీయ వారసులుగా వచ్చిన చంద్రబాబు ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారా? ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌తో పాటు రాష్ట్రానికి చెందిన నేతలను కాంగ్రెస్ పార్టీ అవమానించిందన్నారు.

Related image

ఎన్టీఆర్‌ను అవమానించిన కాంగ్రెస్‌తో ఇప్పుడు చంద్రబాబు అంటకాగుతున్నారని మోడీ పేర్కొన్నారు. ఇంతటి దారుణమైన వ్యక్తిత్వం కలిగిన రాజకీయ నాయకుడు దేశంలోనే లేనట్టుగా చంద్రబాబు పై మోడీ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన విభజన హామీల విషయంలో ఉన్న విషయాలు గురించి పెద్దగా ప్రస్తావించిన మోడీ కేవలం చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడారు.



మరింత సమాచారం తెలుసుకోండి: