నారా లోకేష్ ఏం మాట్లాడిన నెటిజన్స్ ట్రోలింగ్స్ బలి కాక తప్పటం లేదు. ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలియటం లేదు పాపం లోకేష్ కు . ఏదో మాట్లాడబోయి.. మరేదో మాట్లాడుతూ.. లోకేష్ బుక్ అయిపోయేవారు. అందుకు ఇప్పుడు అవి తగ్గిపోయాయి. కేవలం ట్విటర్ కే పరిమితం అవుతూ వాటిని తప్పించుకుంటున్నారు లోకేష్. అయితే అక్కడ కూడా ఈయనను నెటిజన్లు ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు.

Image result for lokesh

ఈయన ట్వీట్ వేస్తూ ఉంటే.. నెటిజన్లు కౌంటర్లు ఇస్తూ ఉన్నారు... ప్రధాని మోడీ మీటింగుకు జగన్ ఆటోలు పంపించారని.. ఏదో వాదన మొదలుపెట్టాడు లోకేష్. అందుకు సంబంధించి ఫొటోలను చూపిస్తూ మీడియాతో మాట్లాడారు. అలాగే ట్విటర్లో కూడా పెట్టారు. తనేదో బ్రహ్మాస్త్రాన్ని సంధించినట్టుగా లోకేష్ ఫీలయ్యారు. అయితే కౌంటర్లు ఇచ్చేవాళ్లు మాత్రం అలా అనుకోలేదు. లోకేష్ ను ఒక ఆటాడుకున్నారు.


లోకేష్ ను ఒక ఆట ఆడుకున్న సోషల్ మీడియా ...!

'పప్పు ఆటో డ్రైవర్ జగన్ గారి మీద అభిమానంతో తన ఆటోకి వెనకమాల స్టికర్ వేసుకున్నాడు... బీజేపీ వాళ్ళ మీటింగ్ కి ఆటోని కిరాయికి పెట్టాడు... ఇది కూడా తెలియదా.. అందుకు కదూ నిన్ను పప్పు అనేది..' అంటూ మొదలుపెట్టి.. లోకేష్ కు నెటిజన్లు కౌంటర్లు ఇచ్చారు. ఇటీవల లోకేష్ సభ ఒకదాంట్లో జగన్ స్టిక్కర్లున్న కుర్చీల ఫొటోలను మరి కొందరు పోస్టు చేశారు. కుర్చీలు అద్దెకు ఇచ్చుకునే వాళ్లు పార్టీలు చూడరు కదా. అదే విధంగా అద్దెకు వెళ్లే ఆటో వాళ్లు ఫలానా పార్టీకి వెళ్లమని అనరు కదా.. కాబట్టి ఇలాంటివన్నీ సహజం అనుకోవాలి. అయితే లోకేష్ కు మాత్రం ఇది బ్రహ్మాండం బద్ధలైన విషయం అనిపించింది. ట్వీటారు. ఇరుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: