ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించి ఏపీ ప్రజలను మోసం చేశారని విభజన హామీల విషయంలో మోడీ ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని మండిపడుతూ ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేపట్టిన సంగతి అందరికీ తెలిసినదే.

Image result for chandrababu

ఈ సందర్భంగా జాతీయ మీడియా చానల్ తో చంద్రబాబు మాట్లాడుతూ..టీడీపీ చేస్తున్న ధర్మపోరాట దీక్షకు వైసీపీ మద్దతివ్వాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. వైసీపీ తమతో కలిసి రావాలని కోరారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు మీతో కలవాలని వైసీపీకి ఎందుకు పిలుపున్నారని మీడియా ప్రశ్నించగా.దానికి సమాధానంగా వైసీపీకి ఒకటో. రెండో స్థానాలొస్తాయని.తమకు మద్దతివ్వడంలో తప్పు లేదని పేర్కొన్నారు.

Image result for chandrababu

ఢిల్లీలో టీడీపీ చేస్తున్న ధర్మ పోరాట దీక్షకు జాతీయ స్థాయిలో భారీ మద్దతు లభిస్తోంది అని పేర్కొన్నారు. మరోపక్క చంద్రబాబు చేస్తున్న దీక్ష పై విపక్ష పార్టీలకు చెందిన నాయకులు మండిపడుతున్నారు.

Related image

ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎదురైందని కనీసం రాష్ట్రంలో ఉన్న యువతకు కనీస ఉద్యోగాలు కూడా ఇచ్చే స్థితిలో ప్రస్తుతం రాష్ట్రం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు వస్తున్న తరుణంలో ఏపీ ప్రజలను మభ్యపెట్టడానికి చంద్రబాబు చేస్తున్నది దొంగ దీక్షలు అంటూ కామెంట్లు చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: