అమరావతి రాజధాని ప్రాంతం, విశ్వవిఖ్యాత అమరావతి మహానగరం కాదు కాస్మో నగరం రూపుదిద్దుకుంటున్న పరిసర ప్రాంతం. గతంలో ఏపి ఆర్ధిక రాజధాని విజయవాడ నగరంలోని గుణదలలో అమ్మాయిల అదృశ్యం సంచలనం భయబ్రాంతులు సృష్టిస్తోంది. అదృశ్యమైన వారిలో ఒకరు మైనర్ అన్న సమాచారం. ఈ నెల 4న ముఖ్యమంత్రి అతి సన్నిహితుడు దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ ను కలవడానికి వెళ్లినప్పటి నుంచి తమ పిల్లలు కనిపించడం లేదని ఆ అమ్మాయిల తల్లి కోటా జ్యోతి మాచవరం పోలీసులకు పిర్యాదు చేయటం తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ ఎమెల్యేపై గతంలో అనేక అభియోగాలున్నాయి. ఈయన వేదింపులకు అపూర్వ అనే సినీనటి, రెవెన్యూ అధికారిణి వనజాక్షి ధారుణంగా గురయ్యారు. అమరావతి-విజయవాడ-గుంటూరు అంటే విశ్వం లోనే అద్భుత రాజధాని అని ముఖ్యమంత్రి చెపుతున్న ఈ ప్రాంతం కాల్-మని, సెక్స్ రాకెట్స్, కల్తీ, ఇసుక, వడ్డీ వ్యాపారాలు నిర్వహించే మాఫియాలకు కూడా రాజధానిగా చెపుతారు. ఆయన గత చరిత్ర సమస్తం స్త్రీలపై దాడులు వేదింపులు కావటంతో అందరి అనుమానపు చూపులు ఆయనం పైనే.
శాసనసభ్యుణ్ణి కలవడానికి వెళ్లిన వారు ఇంకా తిరిగి రాలేదని, వారి నుంచి ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదని, మొబైల్ స్విచ్చాఫ్ అయినట్లు సమాచారం వస్తోందని ఫిర్యాదులో జ్యోతి పేర్కొన్నారు. తన బిడ్డల ఆచూకీ చెప్పాలని కోటా జ్యోతీ పోలీసులను వేడుకుంటున్నారు.
ఈ అదృశ్యమైన ఈ అమ్మాయిల పైనే గతంలో మరో టిడిపి శాసనసభ్యుడు బొండా ఉమ అనుచరులు అత్యాచారయత్నం చేశారు. పక్కా గృహం ఇప్పిస్తామని నమ్మించి ఎమ్మెల్యే కార్యాలయా నికి తీసుకెళ్లి మరీ ఈ ఘోరానికి పాల్పడ్డారని తెలుస్తుంది. ఈ కేసులో అప్పట్లోనే నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి తమకు వేధింపులు ఎక్కువ అయ్యాయని కోటా జ్యోతి ఆవేదన వ్యక్తం చేస్తోంది.