ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో మరో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి సమక్షంలోనే ఓ యువతిపై కొందరు దుర్మార్గులు సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆ యువతిని దారుణంగా చంపేశాడు. ఆ ప్రియుడిని కూడా బాగా గాయపరిచారు.


గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని నవులూరు ఉడా టౌన్‌షిప్‌లో ఈ ఘోరం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తాడేపల్లికి చెందిన శ్రీనివాస్, జ్యోతి ప్రేమించుకుంటున్నారు. సోమవారం వారు డొంక రోడ్డులోకి వెళ్లారు. రాత్రి సమయంలో వారిద్దరే ఉండటంతో కొందరు దుండగులు వారితో అసభ్యంగా ప్రవర్తించారు.


శ్రీనివాస్ పై దాడి చేసి గాయపరిచారు. ఆ తర్వాత జ్యోతిపై సామూహికంగా అత్యాచారం చేశారు. అత్యాచారానికి సహకరించకపోయేసరికి ఆమెను కూడా తీవ్రంగా గాయపరిచారు.

Woman Dragged Out Of Car, Allegedly Gang-Raped By 10 In Punjab


అత్యాచారం తర్వాత వారిద్దరినీ అక్కడే వదిలేసి పారిపోయారు. చావు బతుకుల్లో ఉన్న వారిని గమనించిన స్థానికులు కొందరు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు వచ్చేసరికి జ్యోతి కొనఊపిరితో ఉంది. శ్రీనివాస్ కు తీవ్రగాయాలయ్యాయి. జ్యోతిని హుటాహుటిన ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూనే మరణించింది. శ్రీనివాస్ పరిస్థితి కూడా విషమంగానే ఉందని పోలీసులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: