ఏపీకి జరిగిన అన్యాయంపై ఏపీ సీఎం చంద్రబాబు రాజీలేని పోరాటం చేస్తున్నారు. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సైతం సై అంటే సై అంటూ ఢీకొంటున్నారు. ఈడీ, సీబీఐ వంటి కేసులకు కూడా ఏమాత్రం భయపడటం లేదు. ప్రత్యేక హోదా సాధించడమే లక్ష్యంగా పోరాడుతున్నారు.
తాజాగా ఆయన ఢిల్లీలోనే ఒకరోజు దీక్ష విజయవంతంగా పూర్తి చేశారు. చంద్రబాబు దీక్షకు విపక్షాలు వచ్చి మద్దతు తెలిపాయి. అంతా బాగానే ఉంది. చంద్రబాబు దీక్షల పేరుతో టీడీపీకి బాగానే మైలేజీ వస్తోంది. ఎన్నికల ముందు చంద్రబాబు చేపట్టిన ఈపోరాటం బాగానే వర్కవుట్ అయ్యేట్టుంది.
కానీ ఇదే సమయంలో సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు.. చంద్రబాబును వణికిస్తున్నాయి. అవి మరేవో కావు.. చంద్రబాబు వీడియోలే.. చంద్రబాబు మాట్లాడిన వీడియోలను చూసి ఆయన ఎందుకు భయపడతారంటారా.. ఎందుకంటే అవి ఆయన యూ టర్న్లన్నింటినీ చక్కగా జనానికి వివరిస్తున్నాయి కాబట్టి..
చంద్రబాబు దీక్షల గుట్టుబయటపెట్టేందుకు వైసీపీ సోషల్ మీడియా యాక్టివ్ గా పని చేస్తోంది.. గతంలో చంద్రబాబు మోడీని పొగిడిన వీడియోలు.. హోదా కంటే ప్యాకేజీ బెటర్ అంటూ మాట్లాడిన వీడియోలు.. మోడీనీ, జైట్లీని పొగుడుతూ అసెంబ్లీలో తీర్మానం చేసిన వీడియోలను ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా వైరల్ చేస్తోంది. అదీ సంగతి.