భారత దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని రోజూ వింటూనే ఉన్నాం.  ఏపిలో ఓ యువతిపై దారుణం అత్యాచారాని పాల్పపడటమే కాకుండా హత్యకూడా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.  తాజాగా కారులో వెళ్తున్న ఓ యువతిపై కొంతమంది ఆకతాయిలు అడ్డుకొని కారులోనుంచి బయటకు లాగి మరీ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన పంజాబ్‌లోని లుధియానాలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. 21 ఏళ్ల యువతి తన స్నేహితుడితో కలిసి శనివారం రాత్రి లుధియానా నుంచి కారులో ఐజేవాల్ గ్రామానికి బయలుదేరింది.

ఆ యువతీ యువకులను చూసిన పదిమంది యువకులు మూడు ద్విచక్ర వాహనాలపై వెంబడించారు. అటు..ఇటు కారును చుట్టు ముట్టి కేకలు వేస్తూ అల్లరి చేయడమే కాకుండా భయబ్రాంతులకు గురి చేశారు.  అంతే కాదు కారు ఆగగానే రాళ్లు, ఇటుకలతో దానిపై దాడిచేశారు. అనంతరం కారులోని యువతీ యువకులను బయటకు లాగి సిద్వాన్ కాలువ ఒడ్డుకు తీసుకెళ్లారు.  అక్కడ తమ మిత్రులకు ఫోన్ చేసి వారిని రప్పించి సామూహిక అత్యాచారానికి పాల్పడి అక్కడ నుంచి పారిపోయారు.

ఈ ఘటన తర్వాత బాధితులు అక్కడే ఉండటం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.  వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు. బాధితురాలిని పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్టు నివేదికలో వెల్లడైందని ఎస్పీ తరుణ్ రత్తన్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం వేట ప్రారంభించినట్టు ఎస్పీ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: