భారత దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడి. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ మద్య మాటల యుద్దం ఓ రేంజ్ లో నడుస్తుంది. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహూల్ గాంధీ తాజాగా ప్రధాని నరేంద్ర మోదీని అనుకరిస్తూ మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కాంగ్రెస్ కార్యదర్శిగా ప్రియాంకా గాంధీ బాధ్యతలు చేపట్టేందుకు వచ్చి..లక్నోలో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన రాహుల్, నవ్వులు పూయించారు. మోదీ చెయ్యి ఎలా తిప్పుతారు? ఆయన శరీర కదలికలు ఎలా వుంటాయో అనుకరిస్తూ చూపించారు. గతంలో ఎన్నికల సమయంలో మోదీ ఇలా మాట్లాడేవారు..అయితే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారని హావభావాలను ప్రదర్శించారు.
సోదర సోదరీమణులారా... అనిల్ అంబానీ ఎవరో నాకు తెలియదు. ఆయనకు నేను ఎన్నడూ 20 వేల కోట్ల రూపాయలు ఇవ్వలేదు అని ఆయన అంటున్నారని ఎద్దేవా చేశారు. అయితే రాహూల్ గాంధీ గతంలో కూడా పలు మార్లు ప్రధానిని అనుకరించిన సంఘటనలు ఎన్నో జరిగాయి. ఇటీవల తన భోపాల్ పర్యటన సందర్భంగానూ ఆయన మోదీ గొంతును మిమిక్రీ చేశారు.