ఇక జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి భూమి బదలాయింపే మిగిలి ఉంది. ఇలాంటి నేపథ్యంలో నేటి ఉదయం జరిగిన కేబినెట్ భేటీలో మరోమారు ఈ అంశాన్ని ముందేసుకున్న చంద్రబాబు... జర్నలిస్టులను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటికే ప్రకటించిన ఎకరం భూమి ధర రూ.25 లక్షలను ఏకంగా రూ.10 లక్షలకు తగ్గించేసింది.ఇక ఈ రూ.10 లక్షల రేటును కూడా జర్నలిస్టులు ఇప్పటికిప్పుడే కట్టే అవసరం లేదని చెప్పిన బాబు... దానిని విడతలవారీగా చెల్లించుకోవచ్చని కూడా తనదైన ఉదారతను వ్యక్తం చేశారు.
ఎకరా రూ.10 లక్షల చొప్పున మొత్తం 30 ఎకరాలకు అయ్యే మొత్తం రేటు రూ.3 కోట్లు కాగా.. ఇప్పుడు రూ.1 కోటి చెల్లిస్తే భూమిని బదలాయిస్తామని మిగిలిన రూ.2 కోట్లను మరో రెండు వాయిదాల్లో చెల్లించేసుకోవచ్చని ప్రకటించారు. ఇదంతా చూస్తుంటే... బాబు తనదైన పోల్ మేనేజ్ మెంట్ ను బయటకు తీశారని - ఏ ఒక్క వర్గాన్ని వదిలేది లేదన్నట్లుగా సాగుతున్నట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి.