ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విరుచుకుపడ్డారు. మన రాష్ట్రానికి వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ప్రొటోకాల్ ప్రకారమైనా స్వాగతం చెప్పని దురహంకారి చంద్రబాబు ఇక సంతలో చింతకాయలు అమ్ముకోవాల్సిందేనని హెచ్చరించారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్ కు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఐదున్నర లక్షల కోట్లరూపాయలు ఇచ్చిందని స్పష్టం చేశారు. మరో వైపు మార్చి ఒకటిన విశాఖపట్నంలో బీజేపీ కార్య కర్తలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమం కానున్నారని తెలిపారు. 
somu veerraju about chandrababu కోసం చిత్ర ఫలితం
అలాగే ఫిబ్రవరి 19న ఒంగోలులో, 21న రాజమహేంద్రవరంలో అమిత్ షా బహిరంగసభలు నిర్వహిస్తారని చెప్పారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీని డిల్లి వెళ్ళి ధర్మపోరాట దీక్ష నిర్వహిస్తూ దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీల సానుభూతి సంపాదింది బిజేపి తిట్టడానికి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ₹500 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని ఆరోపించారు.  రాజధాని నిర్మాణం కోసం నరేంద్ర మోదీ నర్మదానది నుంచి నీళ్లు, మట్టి తెస్తే నారా చంద్రబాబు నాయుడు ఆనందంగా అప్పుడు స్వీకరించారని, మరెందుకో ఇప్పుడు విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ వద్ద 'భోజనాల కాంట్రాక్టర్‌ ఇరిగేషన్‌ మంత్రి' బంధువుదేనని స్పష్టం చేశారు. 


బీజేపీ మండలానికో సబ్‌-స్టేషన్‌ కట్టిస్తే టీడీపీ అందులో ఉద్యోగాలు అమ్ముకుంటోందని ఆరోపించారు. గోద్రా సంఘటన నుంచే చం‍ద్రబాబు ప్రధాని మోదీపై కక్షగట్టారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజమెత్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: