టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగనంత అవినీతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుందని విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్లు చేశారు .

Related image

ఇంకా ఆయన మాట్లాడుతూ...చంద్రబాబుపై  విమర్శల వర్షం కురిపించారు. తాను ఎటువైపు ఉంటే ప్రజలందరూ అటువైపే ఉండాలని చంద్రబాబు అనుకుంటున్నారని పేర్కొన్నారు. గతంలో మోడీని పొగిడి ఇప్పుడు తిడుతున్నారని, అసెంబ్లీలో హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు.

Related image

ఎన్నికల్లో డబ్బు పెట్టి గెలవవచ్చనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని, తెలంగాణలో ఏపీ నుంచి రూ.500 కోట్లు తీసుకెళ్లి చంద్రబాబు ఖర్చు పెట్టినా ఓడిపోయారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి కేవలం పత్రికా ప్రకటనలో టీవీ ప్రకటనలు తప్ప వాస్తవంలో లేదని విమర్శించారు.

Image result for talasani vs chandrababu

తోటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యల పరిష్కారానికి టీఆర్ఎస్ మద్దతు ఎప్పుడు ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పార్లమెంటులో కూడా ఏపీకి న్యాయం చేయాలని కోరామని తెలిపారు. ఆనాడు స్వర్గీయ ఎన్టీఆర్ కాంగ్రెస్ భావజాలానికి వ్యతిరేకంగా స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఈనాడు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని తీవ్రస్థాయిలో విమర్శించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: