టీడీపీ నుంచి బయటకు వచ్చిన నాయకులు చంద్రబాబు గురించిన సంచలన విషయాలు బయటపెడుతున్నారు. టీడీపీలో కేవలం ఒక్క కులానికే ప్రాధాన్యత ఉందని చెబుతున్నారు. పార్టీలోనే కాదు.. పాలనలోనూ ఒక్క కమ్మకులానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారట

Image result for chandrababu and his caste


ఇటీవలే టీడీపీని వీడిన ఎమ్మెల్యే ఆమంచి చెప్పిన ఓ విషయం మరీ షాకింగ్ గా ఉందివివిధ కేంద్ర సర్వీసుల నుంచి ఇరవై మందిని తీసుకుంటే అందులో పదిహేను మంది ఒకే సామాజికవర్గం వారని ఆమంచి తెలిపారు. వెంకటరెడ్డి అనే అదికారికి రెడ్డి అని పేరులో ఉన్నందున ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదని కృష్ణమోహన్ సంచలన ఆరోపణ చేశారు.

Image result for chandrababu and his caste


ఇంటిలెజెన్స్ ఆఫీస్ మొత్తం కమ్మ కులం వారితో నింపారని, అది చంద్రబాబు సామాజికవర్గం అని ఆమంచి వివరించారు. మొత్తం కమ్మ కులానికి చెందిన విషవలయం చంద్రబాబు చుట్టూ ఉందని ఆయన ఆరోపించారు. ఆయన ఆఫీస్ లో నలుగురు ఐఎఎస్ లు ఉంటే ఇద్దరు ఆయన సామాజికవర్గమేనని, పిఎస్ తో పలువురు అదే వర్గం వారని ఆయన అన్నారు.

Image result for amanchi krishna mohan


ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ భాస్కర్ కూడా ముఖ్యమంత్రి వర్గం వారేనని ఆమంచి చెప్పారు. ఇన్నాళ్లూ ఇవన్నీ తెలిసినా పెద్దగా ఎవరూ మాట్లాడేవారు కాదు. కానీ జగన్ ఈసీ ముందు ఫిర్యాదు చేసిన తర్వాత వీటిపై అందరి దృష్టీ మళ్లింది. ఇది మరింత పెరిగితే చంద్రబాబుకు రాజకీయంగా హాని తప్పదేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: