టీడీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొన్నాళ్లుగా నిరాఘాటంగా సాగుతూనే ఉంది. నిన్న మొన్నటి వరకూ ఇది పొలిటికల్ గానే ఉండేది.. మోడీ గుంటూరు పర్యటన తర్వాత ఇది కాస్తా పర్సనల్ గా మారింది. గుంటూరు టూర్లో మోడీ.. చంద్రబాబును లోకేశ్ కా పితా అంటూ సెటైర్ వేయడంతో బాబుకు ఎక్కడో కాలింది.



ఇక అప్పటి నుంచి చంద్రబాబు కూడా పర్సనల్ ఎటాక్ ప్రారంభించారు. సాధారణంగా చంద్రబాబు ఇలాంటి వ్యక్తిగత కామెంట్స్ కు దూరంగా ఉంటారు. కానీ లోకేశ్ ను టచ్ చేసే సరికి ఆయన కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఆరోజే.. మీ భార్య గురించి మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకుంటారంటూ ట్వీటారు చంద్రబాబు.

Image result for modi wife


తాజాగా చంద్రబాబు తన విజయనగరం జిల్లా పర్యటనలో మోడీపై పర్సనల్ ఎటాక్ డోస్ మరింత పెంచారు. మళ్లీ మోడీ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. మీరు ఘనంగా ట్రిపుల్ తలాక్ బిల్లు తెస్తామని చెప్పుకుంటున్నారు.. తలాక్‌ ఆచారంలో చెప్పి మరీ విడాకులు ఇస్తారు.



మరి మీరెందుకు మీ భార్యకు మాటమాత్రమైనా చెప్పకుండా ఆమెను వదిలేశారు. భార్యను గౌరవించలేని వ్యక్తి ఇంకా దేశాన్నేం పాలిస్తాడు.. అంటూ భగ్గుమన్నారు. అంతే కాదు.. ఆయన చదువు విషయాన్ని కూడా మరోసారి ప్రస్తావించారు. నేను తిరుపతిలో పీజీ చదవా.. మీరు ఎక్కడ డిగ్రీ చదివారో చెప్పగలరా అంటూ సవాల్ విసిరారు చంద్రబాబు.


మరింత సమాచారం తెలుసుకోండి: