ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చంద్రబాబుకు బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్టుంది. ఒక్కొక్కరుగా పార్టీని వదలిపెట్టి జగన్ చెంతకు చేరుతున్నారు. ఇప్పటి వరకూ కాపు నేతలు, ఎస్సీ నేతలు బాబును వదిలి వైసీపీలో చేరారు. కానీ ఇప్పుడు సొంత కులం నేతలు కూడా బాబుకు షాక్ ఇస్తున్నారు.

Image result for dasari jai ramesh join ysrcp


తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త దాసరి జైరమేశ్ వైసీపీలో చేరారు. వెళ్తూ వెళ్తూ ఆయన కూడా చంద్రబాబు సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం లో జరుగుతున్న అవినీతి తన జీవితంలో ఎన్నడూ చూడలేదని జై రమేష్ అన్నారు.

Image result for dasari jai ramesh join ysrcp


ప్రతి పనికి ఇరవై,ముప్పై శాతం కమిషన్ లు వసూలు చేస్తున్నారని తనకు సమాచారం ఉందని ఆయన అంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు,కార్యకర్తలే చెప్పారని రమేష్ అన్నారు. పలువురు ఎమ్మెల్యేలు రెండేళ్లలోనే ఏభై కోట్ల నుంచి వంద కోట్లు సంపాదించుకున్నారని టిడిపి ఎంపీయే తనతో చెప్పారంటున్నారీయన.

Image result for dasari jai ramesh join ysrcp


తాను జగన్ తో డిమాండ్ ఏమీ పెట్టలేదని అన్నారు. పార్టీలో విషయాలు బయట మాట్లాడేది కూడా కాదని ఆయన అన్నారు. కులపరమైన పెత్తనం జరుగుతోందన్న ప్రచారం ఉన్నదని, దానిని చంద్రబాబు కూడా ఖండించలేదని జైరమేశ్ అన్నారు. జగన్ తో భేటీ అయిన తర్వాత ఆయన అనేక విషయాలు మాట్లాడారు.


మరింత సమాచారం తెలుసుకోండి: