కే ఏ పాల్ తన జీవితంతో ఆడుకున్నాడని ఆరోపిస్తోంది యాంకర్ శ్వేతారెడ్డి. ఆమెను హిందూపూరం ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా ప్రకటించి ఇప్పుడు ప్లేట్ ఫిరాయిస్తున్నాడని ఆరోపిస్తోందామె. తనకు కొంత గడువు ఇచ్చిన కేఏ పాల్.. ఇప్పుడు తనెవరో తెలియదని మీడియాతో చెప్పడంతో ఆమె షాక్ అవుతోంది.

ka paul vs swetha reddy కోసం చిత్ర ఫలితం


అసలింతకూ ఏం జరిగిందంటే.. ఓ ప్రెస్ మీట్లో కే ఏ పాల్ ను యథాలాపంగా యాంకర్ శ్వేతారెడ్డి అడిగిన ఓ ప్రశ్నఆమెను హిందూపురం అభ్యర్థిని చేసింది. నేను మీ పార్టీలోకి వస్తే నాకు టిక్కెట్ ఇవ్వడానికి ఎంత సొమ్ము ఇవ్వాలి అడిగేశారు శ్వేతారెడ్డి. దీంతో అబ్బే అలాంటిదేమీ లేదు. నేను ఎవరి దగ్గరా డబ్బు తీసుకోను.. కావాలంటే మీరు పోటీ చేస్తానంటే హిందూపురం టిక్కెట్ మీకే ఇచ్చేస్తానన్నారు కే ఏ పాల్.

ka paul vs swetha reddy కోసం చిత్ర ఫలితం


అలా అనడమే కాదు.. ఆ ప్రెస్ మీట్లోనే మా ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి శ్వేతారెడ్డి అని ప్రకటించేశారు. పాల్ ఆఫర్ ను సీరియస్ గా తీసుకున్న శ్వేతారెడ్డి హిందూపురంలో పోటీ చేసేందుకు ముందుకొచ్చారు. అయితే ఆ తర్వాత శ్వేతారెడ్డి గురించి ఎంక్వయిరీ చేసిన పాల్.. ఆమె జగన్ కోవర్ట్ అని ఆరోపిస్తున్నారు.

ka paul vs swetha reddy కోసం చిత్ర ఫలితం


గతంలో మద్దెలచెర్వు సూరి మర్డర్ కేసులో శ్వేతారెడ్డికి లింకు ఉందని తనకు తెలిసిందంటున్నారు. ఈ ఆరోపణలతో ఆగ్రహం చెందిన శ్వేతారెడ్డి మీడియాకెక్కి ఇప్పుడు పాల్ పార్టీపై దుమ్మెత్తిపోస్తోంది. మరి ఈ వివాదం ఎక్కడి వరకూ వెళ్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: