ఆయనో సీనియర్ ఎంపీ.. రాజకుటుంబం నుంచి వచ్చారు. చిల్లర రాజకీయాలు చేయరు. హుందాగా ఉంటారు.. అలాంటి ఎంపీ కూడా ఇప్పుడు చంద్రబాబు తీరుపై అలిగారట. చంద్రబాబు వ్యవహారశైలిపై ఆయన ఆగ్రహంగా ఉన్నారట. ఆ కోపంతోనే ఆయన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశానికి సైతం డుమ్మా కొట్టేశారు.

సంబంధిత చిత్రం

ఇప్పుడు ఆ ఎంపీ కూడా వైసీపీలోకి జంప్ కొడతారా అన్నఅనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఆ ఎంపీ ఎవరా అనుకుంటున్నారా.. ఆయనే.. అశోక్ గజపతి రాజు. ఇంతకాలం చంద్రబాబు ఎలాంటి తప్పులు చేసినా ఎక్కడా వ్యతిరేకించని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు తాజాగా అలిగారని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత చిత్రం


కొద్ది కాలంగా అశోక్ గజపతి రాజు అంటి ముట్టనట్లుగా ఉంటున్నారని చెబుతున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం వద్ద విమానాశ్రయ శంకుస్థాపన కార్యక్రమానికి కూడా అశోక్ రాలేదు. వచ్చే ఎన్నికలలో టిక్కెట్ల విషయంలో అశోక్ కు, చంద్రబాబుకు మద్య కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయట.

ashok gajapathi raju కోసం చిత్ర ఫలితం


అశోక్ గజపతి రాజు.. సాధారణంగా పొలిట్ బ్యూరో సమావేశాలకు తప్పకుండా హాజరవుతారు. అందులోనూ రెండేళ్ల తర్వాత జరుగుతున్న పాలిట్ బ్యూరో సమావేశానికి రాజుగారు రాకపోవడం అందరికి ఆసక్తి కలిగించింది. ఆయన పార్టీ మారే ఆలోచనలో ఏమైనా ఉన్నారో ఏమో కనుక్కోమని చంద్రబాబు సీనియర్ నేతలకు పురమాయించారట.


మరింత సమాచారం తెలుసుకోండి: