ఎన్నికలు వస్తున్న క్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలకు సంచలన హామీలు ప్రకటిస్తూ ఎన్నికల వేడిని పెంచుతుంది. ఇప్పటికే అనేక చోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను కేంద్రం ఏ విధంగా రాష్ట్రాన్ని మోసం చేసింది వంటి విషయాలను ఇదే క్రమంలో ప్రతిపక్ష పార్టీ ఏ విధంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు వంటి విషయాలను తెలియజేస్తూ ఏపీ సీఎం చంద్రబాబు అనేక చోట్ల ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తూ ముందుకు సాగుతున్నారు.

Image result for chandrababu

మరియు అదే విధంగా పార్టీ కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు ఎప్పటికప్పుడు టెలీ కాన్ఫరెన్స్ లో అందుబాటులో ఉంటూ ఎన్నికల వ్యూహాలను దిశానిర్దేశం చేస్తున్నారు చంద్రబాబు. ఈ క్రమంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఆర్యవైశ్యులకు ప్రభుత్వం రూ.50కోట్లు కేటాయించిందని మంత్రి నారాయణ అన్నారు.

Related image

నెల్లూరులో తెదేపా ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఆర్యవైశ్యుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్దమైందన్నారు.

Related image

ఆర్యవైశ్య కార్పొరేషన్ పాలకమండలిని ప్రభుత్వం నియమించిందన్నారు. దీంతో టీడీపీ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: