వైసీపీ పార్టీ అధినేత జగన్ తన పదునైన వ్యూహాలతో 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కి దిమ్మతిరిగిపోయే విధంగా మైండ్ బ్లాక్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న బీసీ ఓట్లను కొల్లగొడుతూ టిడిపి కోట గోడలకు బీటలు పెడుతున్నారు జగన్. ఇప్పటికే రాష్ట్రంలో అనేక చోట్ల బీసీ సభలు నిర్వహించిన జగన్ తాజాగా ఏలూరు బీసీ గర్జన నిర్వహించారు.

Image result for jagan bc sabha

ఈ సభలో మాట్లాడిన వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. సీఎం చంద్రబాబు వైసీపీ హామీలను కాపీ కొడుతుందన్నారు. బాబు బీసీలకు ఖర్చు చేసింది మూడువేల కోట్లేనన్న జగన్ వైసీపీ అధికారంలోకి వస్తే ఏడాదికి పదిహేనువేల కోట్లు లెక్కన ఐదేళ్ల 75 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు.

Image result for jagan bc sabha

బీసీలలో ప్రతికూలానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని, వైఎస్ఆర్ చేయూత పథకం కింద 45 ఏళ్ళు నిండిన మహిళకు 75 వేలు ఇస్తామన్నారు. పిల్లల్ని బడికిపంపే తల్లులకు పదిహేనువేలు ఇస్తామని, పిల్లల ఉన్నతచదువులకు ఎంత ఖర్చయినా తామే భరిస్తామని, బీసీ కమిషన్ కు చట్టబద్దత కల్పిస్తామన్నారు.

Image result for jagan bc sabha

ఏ ఒక్క సామాజికవర్గం వివక్షకు గురికాకుండా చూస్తామన్న జగన్ బీసీలను తనకు వెన్నెముక అనే బాబు వాళ్ళను కరివేపాకు తీసేస్తున్నారని.. అన్నదాత సుఖీభవ పథకం కూడా రైతులను మభ్యపెట్టే ప్రయత్నమే అన్నారు. మొత్తం మీద ఏలూరులో జగన్ నిర్వహించిన ఈ భారీ బహిరంగ సభ రెండు గోదావరి జిల్లాలో అదరగొట్టిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.





మరింత సమాచారం తెలుసుకోండి: