కాలం మారిపోయింది. పెద్దవాళ్లే కాదు పిల్లలు కూడా ఇప్పుడు మందు రుచి చూస్తున్నారు. ఏదో కాలేజీ పిల్లలో, డిగ్రీ స్టూడెంట్సో అనుకుంటే పప్పులో కాలేసినట్టు.. పాఠశాల స్థాయిలోనే మందుకొడుతున్నారు. అందులోనూ మందు కొట్టింది అమ్మాయిలు కావడం విశేషం.

సంబంధిత చిత్రం


ఈ ఘటన ఎక్కడో డిల్లీలాంటి నగరాల్లో జరిగింది కాదండోయ్.. మన ఆంధ్రాలోనే. వివరాల్లోకి వెళ్తే.. రాజధాని నగరం విజయవాడ శివారు ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు కొద్ది రోజులుగా కూల్ డ్రింకులో మందు కలిపిన సీసాలతో పాఠశాలకు వస్తున్నారు.

సంబంధిత చిత్రం


ఎవరూ చూడకుండా చున్నీ చాటున కొద్దికొద్దిగా తాగుతున్నారు. శనివారం ఉదయం విరామ సమయంలో తాగారు. పక్కన కూర్చున్న తోటి విద్యార్థినులపై తూలడం మొదలుపెట్టారు. వారి నుంచి మద్యం తాగిన వాసన వస్తుండటంతో ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు.

SCHOOL GIRLS LIQUOR DRINKING కోసం చిత్ర ఫలితం


వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చిన హెడ్ మాస్టర్ ఆ బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించారట. బాలికలు మద్యం తాగినట్లు తేలడంతో అంతా అవాక్కయ్యారు. తల్లిదండ్రులను పిలిపించి, విద్యార్థులతోపాటు వారికీ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. వీరిద్దరూ గతంలో చదువుకున్న పాఠశాలలోనూ ఇదే పని చేయడంతో టీసీలు ఇచ్చారట.


మరింత సమాచారం తెలుసుకోండి: