యాంకర్ శ్వేతారెడ్డి, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ మధ్య డైలాగ్ వార్ రోజురోజుకూ ముదురుతోంది. కే ఏ పాల్ తనకు పార్టీ టిక్కెట్ ఇస్తానని మోసం చేశారని శ్వేతారెడ్డి అంటుంటే.. శ్వేతారెడ్డి క్యారెక్టర్ పై అభాండాలు వేస్తున్నాడు కేఏ పాల్. వీరిద్దరి డైలాగ్ వార్ ఓ టీవీ ఛానల్లో హాట్ టాపిక్ అయ్యింది.
ఒక టీవీ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన కేఏ పాల్ శ్వేతారెడ్డిపై కొన్ని ఆరోపణలు చేశారు. శ్వేతారెడ్డి జగన్ పవన్ చంద్రబాబు కోవర్ట్ అన్నాడు. అంతే కాదు.. ఆమె మద్దెలచెర్వు సూరి గర్ల్ ఫ్రెండ్ అంటూ చీప్ కామెంట్స్ చేశాడు. ఈ ఆరోపణలతో శ్వేతారెడ్డి శివంగే అయ్యింది.
అదే ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చిన శ్వేతారెడ్డి ఓ రేంజ్లో కే ఏ పాల్ ను కడిగిపారేసింది. కే ఏ పాల్ ఓ పిచ్చికుక్క అంటూ రెచ్చిపోయింది. ఆయన పిచ్చి రోజురోజుకి ముదిరిపోతుంది. ప్రస్తుతం విచిత్రంగా మాట్లాడుతున్న ఆయన.. కొన్నాళ్ల తర్వాత కరవడం మొదలుపెడతారు అంటూ కడిగిపారేసింది.
కేవలం డబ్బుల కోసం ప్రజాశాంతి పార్టీ పెట్టిన పాల్.. నలుగుర్ని వెంటేసుకుని చందాలు వసూలు చేస్తున్నాడట. ఇంకా ఏమందండే... " నేను జగన్ చంద్రబాబు పవన్ కోవర్టునా.? ఒక్కసీటు కూడా గెలవలేని నువ్వా నన్ను విమర్శించేంది.? నీకు డబ్బులు కావాలంటే రోడ్డుమీదకు వెళ్లి అడుక్కో. తలా ఒక రూపాయి వేస్తారు. ఏంటి నేను మద్దెలచెర్వు సూరి గర్ల్ ఫ్రెండ్ నా? ఏం మాట్లాడుతున్నావ్.? హౌ డేర్ యు టు టాక్ లై దట్? అంటూ వార్నింగ్ ఇచ్చింది.